అలంపూర్/ఉండవెల్లి, జనవరి 16 : అభాగ్యులకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన బాధితులకు రూ.26.66 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
అలాగే ఉండవెల్లి మండలంలోని కంచుపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్ కొన్ని నెలల కిందట రోడ్డు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మంజూరైన రూ.2లక్షల చెక్కును మృతుడి భార్య జ్యోతికి ఎమ్మెల్యే అందజేశారు. ఎంపీపీ బీసమ్మ, వైస్ఎంపీపీ దేవన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణ, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు లోకేశ్వరరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.