నాగర్కర్నూల్, ఫిబ్రవరి 11 : ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న సామూహిక వివాహాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శనివారం అవిరేణి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సతీమణి, ట్రస్ట్ డైరెక్టర్ మర్రి జమునారాణి సమక్షంలో నిర్వహించారు. అనంతరం పెండ్లి మండపంలో వందలాదిగా తరలివచ్చిన ముత్తయిదువులతో త లాంబ్రాలు, ఒడిబియ్యం కార్యక్రమాన్ని చేపట్టారు. మర్రి జమున, మహిళా కౌన్సిలర్లు హాజరై తలంబ్రాలను సిద్ధం చేశారు. సా యంత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వా మి విగ్రహాలతో పెండ్లి మండపం వరకు భజనలు, చిన్నారుల కోలాటాల మధ్య శోభాయాత్ర నిర్వహించారు. ఆదివారం జరిగే పెండ్లి వేడుకలకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. వీఐపీలు, ప్రజాప్రతినిధుల కో సం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
చెరువునిండా నీళ్లుండి ఒక్క మడినన్న తడపకపోతే.. చెట్టునిండా పూలుండి ఒక్క జడనన్న అలంకరించకపోతే.. కల్లం నిండా గింజలుండి పేదవాడి గిన్నెలో మెతుకు కాకపోతే.. జీవితానికి సార్థకత ఎక్కడిది.. దీ ని అర్థం గ్రహించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. మనుషులంతా ఒకటేనన్న భావనతో పలనాటి వీర చరిత్రలో బ్రహ్మానాయుడు చాపకూడు సహపంక్తి భోజనాలను చదువుకున్నాం.. నాగర్కర్నూల్లో పాలెం సుబ్బయ్య వి ద్యాసంస్థలు స్థాపించి విద్యాదాతగా పేరుగడించాడు.. మాజీ ఆర్థిక శాఖ మంత్రి కీ.శే.పుట్టపాగ మహేంద్రనాథ్ హాస్టళ్లను నెలకొల్పి బడుగు, బలహీన వర్గాల వారికి విద్యావెలుగులు పూయించిన మహనీయుడు.. అ లాంటి వారి అడుగుజాడల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి దంపతులు న డుస్తున్నారు. సామూహిక వివాహాలు జరిపిస్తూ పేదల ఇండ్లల్లో కాం తులు నింపుతున్నాడు. ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదోసారి నిర్వహిస్తున్న వేడుకలకు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం ముస్తాబైం ది. ఆకాశమంతటి ముత్యాల పందిళ్లు, భూదేవంత సంబురాలు, మా మిడి తోరణాలు, మంగళవాయిద్యాలు, సప్తస్వరాల పెండ్లి పాటలు, నక్షత్రాలే నేలన విరబూసినట్లు విద్యుద్దీపకాంతులు, ఇంద్రధనస్సుల్లాంటి ముగ్గుల్లో జీలకర్రబెల్లం, మాంగల్యతాంబూలాలు, వానచినుకుల్లా అ క్షింతలతో ఆశీర్వాదాలు.. ఇలా వేడుకలను నిర్వహించేందుకు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ మైదానం వేదికైంది. అనంతపురం జిల్లాలో కీ.శే.పరిటాల రవి వందమందికి పెండ్లిండ్లు జరిపించిన ట్లు చూశాం.. కానీ, నాగర్కర్నూల్ జిల్లాలో ఆదివారం 220 జంటలు ఏకకాలంలో ఒక్కటి కానున్నాయి.
ఇందుకు ఎంజేఆర్ ట్రస్ట్ సంకల్పించింది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఆయన సతీమణి జమున మానవత్వం, దాతృత్వం వర్ణించలేనిది. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ ఆహ్వాన పత్రికలు పంపిణీ చేశారు. 220 ముత్యాల పందిళ్లు వేశారు. ప్ర తీ జంటకు ఒక పురోహితుడిని కేటాయించారు. కులమతాలకతీతంగా అన్ని రకాల సంప్రదాయాలతో ధనవంతుల ఇండ్లల్లో జరిగే వేడుకల్లాగా పెండ్లి తంతును జరిపించనున్నారు. ‘ఊరంతా తిని చేయి కడగడం కా దు.. ఊరు చేయి కడిగేవాడే మహాత్ముడు’. వధూవరులు, తల్లిదండ్రుల కు పట్టువస్ర్తాలు, మంగళసూత్రం, మెట్టెలు, మూడు గ్రాముల బంగా రం, బాసింగాలు, తలంబ్రాలు, బీరువా, పరుపు, కుర్చీలు, ఫ్యాన్లు, మె త్తలు, స్టీల్ సామానులు, ఇత్తడి పాత్రలు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, డబుల్ కాట్ మంచం.. ఇలా ఒక్కో జంటకు దాదాపుగా రూ.లక్షన్నర విలువచే సే వస్తువులను ప్రతి జంటకూ అందజేస్తున్నాడు. పెండ్లి ఫొటోఆల్బమ్ తయారుచేయించి నూతన దంపతులకు కానుకగా ఇస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు 486 జంటలకు అంగరంగ వైభవంగా ‘న భూ తో.. న భవిష్యత్’ అన్న రీతిలో సామూహిక వివాహాలు జరిపించారు. ఇప్పుడు ఐదోసారి ఏకంగా 220 జంటలకు పెండ్లిండ్లు చేస్తున్నారు. నా గర్కర్నూల్లో అత్యంత దేదీప్యమానంగా జరుగుతున్న కల్యాణాలను చూసేందుకు మీరంతా తప్పకుండా హాజరుకండి.. నాగర్కర్నూల్ సామూహిక వివాహ మహోత్సవాలకు రండి..! రారండి…!!
– వనపట్ల సుబ్బయ్య, కవి,
చరవాణి : 9492765358, నాగర్కర్నూల్