అచ్చంపేట, ఆగస్టు 19 : మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ సంక్షే మ పథకాలు అమ లు చేస్తున్నారని ప్ర భుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వ ల బాలరాజు అన్నా రు. శనివారం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో 34కుటుంబాలకు మైనార్టీబంధు ద్వారా మంజూరైన రూ.లక్ష చెక్కులను జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్తో కలిసి పంపిణీ చేశారు. ఆర్డీవో గోపిరామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభు త్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. గతంలో ఎవరూ చేయని విధంగా మైనార్టీల సంక్షేమం గు రించి సీఎం కేసీఆర్ ఆలోచించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అచ్చంపేటలో ఈద్గా కో సం రూ. 50లక్షలు, అచ్చంపేటలో ఫంక్షన్హాల్ ని ర్మాణం కోసం రూ.2కోట్లు కేటాయించామన్నారు. టెండర్ అయ్యాక పనులు ప్రారంభిస్తామన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి అన్నారు. మైనార్టీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణ, మున్సిపల్ మాజీ చైర్మన్ తులసీరాం, జెడ్పీటీసీ రాంబాబు, మైనార్టీ నాయకులు అమీనొద్దీన్, రహెమత్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పర్వతాలు, కౌన్సిలర్ రమేశ్రావు, కమిషనర్ శ్రీహరిరాజు, ఎంపీడీవో మధుసూదన్గౌడ్ పాల్గొన్నారు.
గద్వాల, ఆగస్టు 19 : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొదటి విడుతగా మంజూరైన 52మంది లబ్ధిదారులకు మైనార్టీబంధు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్గానే ఉపయోగించుకున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీ ఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చేయూతనిస్తున్నారని తెలిపారు. షాదీముబారక్, మత పెద్దలకు గౌరవ వేతనం, గురుకులాల విద్యార్థులకు మెరుగైన విద్య తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. మై నార్టీలందరూ బీఆర్ఎస్కు అండగా నిలవాలని కోరారు. అనంతరం మల్దకల్ మం డలం మల్లెందొడ్డికి చెందిన కర్రె నర్సింహులు మృతిచెందగా, మంజూరైన రైతుబీమా రూ.5లక్షల చెక్కును నర్సింహులు భార్య దేవమ్మకు ఎమ్మెల్యే అందజేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన సవారన్నకు రూ.60వేలు, వెంకటేశ్కు రూ.18500లకు సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు మంజూరు కాగా, ఎమ్మెల్యే అందజేశారు.