తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న ఉద్యమ అమరులను మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్మరించుకున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో అమరులకు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
– నెట్వర్క్ మహబూబ్నగర్, జూన్ 22
వనపర్తి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి కుటుంబాలను మంత్రి నిరంజన్రెడ్డి ఘనంగా సన్మానించారు. దాసరి నరేశ్ తల్లి దాసరి చెన్నమ్మ, కావలి సువర్ణ తల్లి కావలి రాములమ్మ, వీరసాగర్ అక్క పద్మ, సత్యమ్మ కుమారుడు నాగరాజులకు సత్కారం దక్కింది.
– వనపర్తి, జూన్ 22
మహబూబ్నగర్ జిల్లాలో అమరుల కుటుంబ సభ్యులను మంత్రి శ్రీనివాస్గౌడ్ గురువారం ఘనంగా సన్మానించారు. అనిల్కుమార్ రెడ్డి తల్లి యాదమ్మ, మల్లేశ్ తల్లి మణెమ్మ, బోయ చెన్నయ్య భార్య రాములును మంత్రి సత్కరించారు.
– మహబూబ్నగర్, జూన్ 22
నాగర్కర్నూల్ జిల్లాలో రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వంకే శ్వరం గ్రామానికి చెందిన నాగరాజు తల్లి ఈశ్వరమ్మ, ఉప్పునుంతలకు చెందిన బాలస్వామి భార్య అలివేల, కల్వకుర్తికి చెందిన కృష్ణయ్య కుమారుడు రామును ప్రభుత్వ విప్ గు వ్వల బాలరాజు ఘనంగా సత్కరించారు. అమరుల కుటుంబాలకు పాదాభివందనం చేశారు.
– నాగర్కర్నూల్, జూన్ 22
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన కొత్తకోట మండలంలోని మిరాసిపల్లికి చెందిన సువర్ణ తల్లి రాములవ్వను, కొత్తకోటకు చెందిన దాసరి నరేశ్ తల్లి చెన్నమ్మను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నాసాగర్లో ఘనంగా సన్మానించారు.
– భూత్పూర్, జూన్ 22
1969 తెలంగాణ ఉద్యమంలో గద్వాల మండలం చెనుగోనిపల్లికి చెందిన పాశం సర్వారెడ్డి మృతిచెందగా, బంధువు పాశం శ్రీనివాస్రెడ్డిని జెడ్పీచైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, అబ్రహంలు ఘనంగా సన్మానించా రు. అలాగే ఉద్యమంలో భాగంగా గద్వాలలో జరిగిన కాల్పుల్లో మరణించిన కొట్టం వేణుగోపాల్ పెదనాన్న వెంకటస్వామిని సన్మా నించారు.
– గద్వాల, జూన్ 22