మహబూబ్నగర్, డిసెంబర్ 7 : అనారోగ్యం ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటున్నదని, ఎవరూ అధైర్యపడొద్దని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ భరోసా ఇచ్చారు. స్థానిక బోయపల్లికి చెందిన ఎం.అంజమ్మ వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.2.50లక్షల ఎల్వోసీని బుధవారం జిల్లా కేంద్రంలో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపత్కాలంలో ప్రభుత్వం ప్రతి కుటుంబానికీ అండగా నిలుస్తున్నదన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్ది మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఎవరికీ ఎలాంటి సమస్య ఏర్పడినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్లో టీఆర్ఎస్ నాయకుడు మల్లు నర్సింహారెడ్డి నివాసంలో బుధవారం నిర్వహించిన అయ్యప్ప పడిపూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వాములతో కలిసి భక్తిగీతాలను ఆలపించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ తాటి గణేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్ పాల్గొన్నారు.