మహబూబ్నగర్ టౌన్, మే 8 : మహబూబ్నగర్ పట్టణంలో ఊహించని అభివృద్ధ్ది జరుగుతోందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలోని రైల్వే బ్రిడ్జి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభానికి వెళ్తూ మధ్యలో అప్పన్నల్లి రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జిని, ఆర్అండ్బీ చౌరస్తా, రహెమానియా బ్రిడ్జి, అశోక్టాకీస్ చౌరస్తా పనులను మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పన్నపల్లి మొదటి బ్రిడ్జి 12 ఏండ్లలో నిర్మించగా, 2వ బ్రిడ్జిని కేవలం 12నెలల్లో పూర్తి చేయడంతో మంత్రి శ్రీనివాస్గౌడ్కు పాలమూరు అభివృద్ధిపై ఉన్న కృషి, పట్టుదల అర్థమవుతుందని అన్నారు.
ఒకప్పుడు మహబూబ్నగర్లో ఇరుకు రోడ్లలో తీవ్ర ఇబ్బందులు ఉండేవని, రాకపోకలు స్తంభించి ట్రాఫిక్ జామ్ ఏర్పడేదన్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారని, విశాల రోడ్లు నిర్మించారన్నారు. అనంతరం మంత్రి డా.వీ.శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ఒకప్పడు వలసకూలీలకు అడ్డాగా ఉన్న పాలమూరు ఇప్పుడు ఉపాధికి చిరునామాగా మారిందన్నారు. గతంలో జడ్చర్ల నుంచి మహబూబ్నగర్కు సింగిల్ లేన్ రోడ్డు మాత్రమే ఉండేదని, దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యేదన్నారు. మహబూబ్నగర్ను అన్ని విధాలుగా అభివృద్ధ్ది చేస్తామని తెలిపారు. మంత్రుల వెంట ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్ పాల్గొన్నారు.
ఆలిండియా ర్యాంకర్కు అభినందన..
జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలకు చెందిన శివప్రసాద్ జేఈఈ మెయిన్స్లో ఆలిండియా 127వ ర్యాంకు సాధించగా మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు.