మహబూబ్నగర్ను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో ఉదయం వాకర్స్తో ముచ్చటించారు. అనంతరం పలువార్డుల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడాకారుల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఉదండాపూర్ నుంచి కృష్ణాజలాలను తీసుకొచ్చి మినీ ట్యాంక్బండ్ను నింపుతామన్నారు. శిల్పారామంలో వాటర్ రైడింగ్, వేవ్ పూల్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పేదలకు ఎక్కడ కష్టం జరుగుతుందో అక్కడ తాను ఉంటానన్నారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు.
మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 16 : మహబూబ్నగర్ను క్రీడాహబ్గా మా రుస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేం ద్రంలోని స్టేడియం మైదానంలో గురువారం మార్నిం గ్ వాక్ చేసి వాకర్స్తో మాట్లాడారు. మహబూబ్నగర్లో పదేండ్లలో చేసిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫుట్బాల్ గ్రౌండ్, షటిల్ బ్యాడ్మింటన్, బా క్సింగ్ కోసం క్రీడాకారులకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఇండోర్ స్టేడియం నిర్మించామన్నారు. కేసీఆర్ ఎకో పార్కు లో యోగా షెడ్డు, అతిపెద్ద అర్బన్ జంగల్ సఫారీ ఏర్పాటు చేసుకున్నామన్నారు. నెక్లెస్రోడ్డుపై 3.5 కిలోమీటర్ల మేర నిర్మించిన వాకింగ్ ట్రాక్ వద్దకు, స్టేడియానికి చేరుకునేందుకు ర్యాంప్ ఏర్పాటు చేసి వాకింగ్ చేసే వారికి అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఉందండాపూర్ నుంచి కృష్ణాజలాలను తీసుకొచ్చి ట్యాంక్బండ్ను నిం పుతామన్నారు. ఐటీ పార్క్ ద్యారా 50వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు..శిల్పారామంలో వాటర్రైడింగ్, వేవ్పూల్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దివిటిపల్లి వద్ద హైవే విస్తరణ, భవిష్యత్తులో మహబూబ్నగర్, భూత్పూర్, జడ్చర్లను కలిపి గ్రేటర్ మహబూబ్నగర్ చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి 12ఏండ్లలో కడి తే.. బీఆర్ఎస్ హ యాంలో రెండో బ్రిడ్జిని 12 నెల ల్లో నిర్మించామన్నారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ము న్సి పల్ చైర్మన్ కేసీ నర్సిం హులు, ముడా చైర్మన్ గంజివెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, కౌన్సిలర్ రామ్లక్ష్మణ్ పాల్గొన్నారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్కు ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు. స్టేడియం మైదానం సమీపంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు రాయికంటి రాందాస్ ఆ ధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన ప్లకార్డులను మంత్రి ఆవిష్కరించారు. బహుజనుల సంక్షేమం కోసం కృషి చేస్తు న్న బీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాడమే కాకుండా ఆ మహనీయుడి అతిపెద్ద విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రతిష్టించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. అనంతరం 44వ వార్డు రవీంద్రనగర్, 45వార్డు పాతతోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో ప్రజలు మంత్రికి బ్రహ్మరథం పట్టారు. ప్రచార రథం నుంచి మంత్రి ప్రసగించారు. ప్రతి వార్డును అభివృద్ధి చేశామని, భవిష్యత్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. అంతకుముందు రవీంద్రనగర్లో ఓ లాండ్రీషాపు వద్ద ఇస్త్రీ చేసి, ఓ హోటల్ వద్ద వేడివేడి వడలు వేశారు. కారు గుర్తు ఓటు వేయాలని కోరారు. అనంతరం పలువురు మంత్రి సమక్షంతో బీఆర్ఎస్ చేరారు. కార్యక్రమంలో గొర్రె కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, కౌన్సిలర్ వేదావ్రత్, నాయకుడు చిన్నా, నాయకులు సంగమేశ్వర్, పరమేశ్వర్, అశోక్, అనీల్, చంద్రమ్మ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.