హన్వాడ, సెప్టెంబర్ 26 : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని 70ఏళ్లు పలించిన ఆంధ్రోళ్లు ఆగం చేశారని, వారి పాలన అంతమైన తరువాతనే స్వచ్ఛమైన పాలన కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ సుడిగాలి పర్యటన చేశారు. అయోధ్యనగర్, అత్యకుంటతండా, రామన్నపల్లి, వేపూర్, లింగన్నపల్లి గ్రామాల్లో రూ.6.01కోట్లతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాల్లోనే మొట్టమొదటి సారిగా ప్రతి ఇంటికీ నల్లతోపాటు శుద్ధజలం అందిచామన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మరోసారి పట్టం కడితే మరింతాభివృద్ధి చేస్తాన్నారు. మనరాష్ట్ర-మన పాలనలో బంగారు తెలంగాణ సాధించుకుందమన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుడడంతో ఆయా పార్టీలకు చెందిన మయాగాలు వస్తున్నారని, వారి పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మంత్రికి గ్రామ గ్రామాన ఘనంగా స్వాగతలు పలికారు. వేపూర్ లో గజమాలతో మంత్రిని సన్మానించారు.
అభివృద్ధి పనుల జాతర
మండలంలోని అయోధ్యనగర్లో రూ.7లక్షలతో ఎస్టీ కమ్యూనిటీహాల్, రూ.2లక్షలతో రామాలయం కాంపౌండ్, రూ.12లక్షలతో మహిళా సంఘం భవనాల నిర్మాణాలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ శంకుస్థాపన చేశారు. అత్యకుంటతండాలో రూ.37.70లక్షలతో మూడు వాటర్ ట్యాంకుల నిర్మాణం, రూ.15లక్షలతో వేసిన సీసీరోడ్డును ప్రారంభించారు. రామన్నపల్లిలో రూ.20లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం కోసం, రామన్నపల్లి నుంచి బల్సుర్గడ్డ తండా వర కు రూ.45లక్షలతో చేపట్టిన బీటీరోడ్డు పనులు, రూ.12లక్షలతో మహి ళా సంఘం భవనాలకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.13.14లక్షలతో వేసిన సీసీరోడ్డు, రూ.5లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు.
వేపూర్లో రూ.3.45కోట్లతో వాగుపై నిర్మిస్తున్న రెండు చెక్డ్యామ్లు, వేపూర్ నుంచి కోతలాబాద్ వరకు రూ.1.40కోట్లతో బీటీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.13లక్షలతో వేసిన సీసీరోడ్డు, రూ.35.39లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు. లింగన్నపల్లిలో రూ.20లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ.12లక్షలతో మహిళా సంఘం భవనం, రూ.5లక్షలతో నిర్మిస్తున్న యాదవ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.10లక్షలతో వేసిన సీసీరోడ్డును మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయనిర్మాల, రామణారెడ్డి, ఎంపీపీ బాలరాజు, వైస్ ఎంపీపీ లక్ష్మి, తాసీల్దార్ కిష్టానాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజుయాదవ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు అన్వర్, మండల కోఆప్షన్ మన్నాన్, ఏపీఎం సుదర్శన్, నాయకులు లక్ష్మయ్య, బాలయ్య, బాలాగౌడ్, హరిచందర్, జంబులయ్య, అనంద్, ఖాజాగౌడ్, యాదయ్య, బసిరెడ్డి, పెంట్యానాయక్, నరేందర్, డబ్బరాములు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుల సంఘాల కన్వెన్షన్ హాల్కు నిధులు మంజూరు
జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో వివిధ కుల సంఘాల కన్వెన్షన్ హాల్ నిర్మాణం కోసం రూ.9కోట్ల నిధులు విడుదల కాగా అందుకు సంబంధించిన ఉత్తర్వులను మంత్రి శ్రీనివాస్గౌడ్ మంగళవారం అ సంఘం నాయకులకు అందజేశాడు. రెడ్డి బంధువుల కన్వెన్షన్ హాల్కు రెండు ఎకారాల భూమి, రూ.3కోట్ల నిధులు, యాదవుల కన్వెన్షన్కు ఎకరా భూమి, రూ.2కోట్ల నిధులు, గౌడ్స్ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి రూ.3కోట్లు నిధులు, కాశికాపటి సామాజిక వర్గం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.కోటి సం బంధించిన ఉత్తర్వులు అందించారు. అనంతరం ఆయా సంఘాల నాయకులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతుబం ధు సమితి జిల్లా డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గిరిధర్రెడ్డి, రవికిషన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి, సు దీప్రెడ్డి, గొర్రె కాపరుల సంఘం అధ్యక్షుడు శాంతన్నయాదవ్, గోపాల్యాదవ్, గ్రంథాలయా సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నారాయణగౌడ్, వెంకటస్వామి, జగన్మోహన్గౌడ్ పాల్గొన్నారు.