మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 31 : బీఆర్ఎస్ గెలుపునకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ క్యాంప్ కార్యాలయంలో వీహెచ్పీకి చెందిన గుబ్బ భరత్, రాఘవేంద్రగుప్తా, రామేశ్వర్, ప్రమోద్, శ్రీనివాస్, చంద్రశేఖర్, 37వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసులు, మనిస్వామి, కుమార్, అంజి, వెంకటేశ్, మన్యంతోసహా 50 మంది.., హన్వాడ మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు రాములు, కేశవులు, ఆనంద్, తిరుపతయ్య, శ్రీను, కల్యాణ్, బోయ వెంకటయ్య, పుల్లయ్య, నర్సింహులు, లక్ష్మయ్య, యాదయ్య, అంజయ్యతో సహా 50 మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
హన్వాడ, అక్టోబర్ 31 : గ్రామాల్లో చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి ఆదరించాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. మండలంలోని కొత్తపేట, దచ్చక్పల్లి, వెంకటమ్మకుంట తండాలో మంగళవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. మంత్రికి ఆయా గ్రామాల్లో డప్పచప్పుళ్లు, బోనాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుబీమా మాదిరిగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కేసీఆర్ బీమా వర్తింపజేస్తామన్నారు. సౌభాగ్యలక్ష్మి కింద అర్హులైన ప్రతి మహిళకూ నెలకు రూ.3 వేల భృతి అందిస్తామన్నారు. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమన్నారు. రూ.5లక్షల ఆరోగ్యశ్రీ నిధిని రూ.15 లక్షలకు పెంచుతామని, రేషన్ దుకాణాల ద్వారా ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందిచనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రతి గ్రామంలో రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఎంతో మందికి సీఎం సహాయనిధి ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నదన్నారు. కొత్త, పాత నాయకులు తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి బీఆర్ఎస్ గెలుపునకు పని చేయాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అనంతరం దచ్చక్పల్లి గ్రామంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు రామిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు కృష్ణయ్యతోపాటు 30 మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, రమణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, సర్పంచులు చెన్నమ్మ, రాములు, బాలకిష్టారెడ్డి, ఎంపీటీసీ అరుణ్, సింగిల్విండో వైస్ చైర్మన్ వెంకటయ్య, నాయకులు కృష్ణయ్యగౌడ్, లక్ష్మయ్య, జంబులయ్య, శేఖర్, బాలయ్య, యాదయ్య, నరేందర్, హరిచందర్, చెన్నయ్య, సత్యం, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 31 : ప్రజలకు నిరంతరం సేవ చేస్తానని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని 15వ వార్డు పరిధిలో ఉన్న చిన్నదర్పల్లి, లక్ష్మణ్లీలానాయక్తండా, లచ్చిరాంతండా, పూజారి తండా, చిరుమల్కుచ్చతండాలలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రికి కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నదర్పల్లి పక్క నుంచి బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్నాయని, హన్వాడలో ఫుడ్పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. ఫుడ్, ఐటీ పార్కుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మాకు కులం, మతం, పార్టీతో సంబంధం లేదని, ఎవరైనా ఆపదలో ఉంటే సాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలోని దచ్చక్పల్లి గ్రా మంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రచారం చే స్తుండగా.. వృద్ధురాలు గౌరమ్మ మైక్ తీసుకొ ని మాట్లాడారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉ న్నప్పుడు భూములు, పంటలకు రకం(కిస్తు) కట్టేవాళ్లం. తెలంగాణ వచ్చిన తరువాత పం ట పెట్టుబడితోపాటు ప్రతి ఇంటికీ నల్లాలతో తాగునీళ్లు ఇస్తున్నారు. గతంలో డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కునేవాళ్లం. లేదంటే పొలాల వద్దకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. మీరు మాకోసం ఎంతో చేశారు. మళ్లీ కారు గుర్తే గెలుస్తుంది. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశావ్. నువ్వు చల్లగా ఉండాలి బిడ్డా..’ అని గౌరమ్మ తెలిపారు.