హన్వాడ, మార్చి 16 : ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారద అన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ జన్మదినం సందర్భంగా గురువారం హన్వాడలో కేక్ కట్ చేసిన అనంతరం శాంతా నారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్టు అధ్వర్యంలో 80 మంది విద్యార్థులకు సైకిళ్లును పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇతర గ్రామాల నుంచి పాఠశాలలకు వస్తున్న విద్యార్థులకు మాత్రమే సైకిళ్లు అందించినట్లు తెలిపారు.
గతంలో జరగని అభివృద్ధి మంత్రి శ్రీనివాస్గౌడ్ అయ్యాక పరుగులు పెడుతుందన్నారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా మెము ఉన్నామని భరోసా ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల్రాజ్, జెడ్పీటీసీ విజయ నిర్మల, ఎంఈవో రాజునాయక్, విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, పార్టీ అధ్యక్షుడు కరుణాకర్గౌడ్, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు రాజుయాదవ్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, ఎంపీడీవో ధనుంజయగౌడ్, సర్పంచులు రేవతి, శ్రీదేవి, మానస ఎంపీటీసీ కల్పన పాల్గొన్నారు.