పాలమూరు, అక్టోబర్ 16 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయం సాధించాలని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆకాంక్షించా రు. సోమవారం తిరుమలతిరుపతి వేం కటేశ్వరస్వామిని మంత్రి దర్శించుకున్నా రు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా మూడోసారి గెలవాలని, ఆయన అడుగుజాడల్లో తాము పనిచేసేందుకు మరోసారి అవకాశం కల్పించాలని స్వామిని వేడుకున్నానన్నారు.
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న తరువాత నేరుగా వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చానన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచామన్నారు. భవిష్యత్లో తెలంగాణ అన్ని రంగాల్లోనూ నెంబర్వన్గా నిలుస్తుందన్నారు. మం త్రి వెంట తెలంగాణ పర్యాటక శాఖ ఎండీ మనోహర్, గొర్రెల కాపరుల సం ఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ ఉన్నారు.
తెలంగాణ భక్తులకు ప్రాధాన్యమివ్వాలి..
వెంకన్న దర్శనానికి వచ్చే తెలంగాణ భక్తులకు టీటీడీ తగిన ప్రాధాన్యతనివ్వాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. స్వామి దర్శనం అనంతరం టీటీడీ చైర్మ న్ భూమన కరుణాకర్రెడ్డితో భేటీ అ య్యారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వచ్చే భక్తులకు ప్రస్తుతం ఇ స్తున్న వాటికి అదనంగా మరో 500 టి కెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకుగానూ టీటీడీ చైర్మన్ సానుకూలంగా స్పందించారు.