ఆత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ పార్టీశ్రేణులు బ్రహ్మరథం పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అపూర్వ ఆదరణ లభిస్తున్నది. నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. సమావేశాలకు హాజరయ్యే ముఖ్య నేతలకు ర్యాలీలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు గులాబీ
మయంగా మారుతున్నాయి. మంగళవారం మహబూబ్నగర్లో నిర్వహించిన సమ్మేళనానికి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరై దిశానిర్దేశం చేశారు. ఆయా వార్డుల్లోని సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు.
కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఎవరైనా ఆపద సమయంలో తనకు ఫోన్ చేసినా.. ఎస్ఎంఎస్ పంపినా వెన్నంటే ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే చారకొండ, మానవపాడు, ధన్వాడ, జక్లేర్లో నిర్వహించారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు అబ్రహం, రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథంతోపాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు.
మహబూబ్నగర్ అర్బన్, మార్చి 28 : త్వరలోనే మహబూబ్నగర్ మున్సిపాలిటీలో వార్డు పర్యటనలు చేపడుతానని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పెండింగ్లో ఉన్న వాటిని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పు డు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014 ఎన్నికల కంటే ముందు నుంచే ని త్యం మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉంటూ.. అత్యవసర వేళల్లో అర్ధరాత్రి ఫోన్ చేసినా, మెస్సేజ్ చేసినా వెంటనే స్పందిస్తూ అండగా నిలుస్తున్నట్లు చెప్పారు.
చిన్న స్థాయి కార్యకర్త అయినా.. కష్టపడి పనిచేస్తే తగిన గుర్తింపు ఉంటుందన్నారు. తాగునీటికి ఇబ్బంది పడిన పరిస్థితి నుంచి.. నేడు అన్ని రం గాల్లోనూ మహబూబ్నగర్ జిల్లా దూసుకుపోయేలా చేశామన్నారు. కార్యకర్తలు సైత్యం ని త్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజల సహకారంతో భవిష్యత్లో నియోజకవర్గాన్ని మరిం త సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం పూర్తయితే క్యా న్సర్, హృద్రోగ, ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధులకు స్థానికంగా వైద్యం అందనుందన్నారు. పెట్రో ఉత్పత్తులకు గల్ఫ్ ప్రఖ్యాతి అయి తే..
మహబూబ్నగర్ లిథియం బ్యాటరీలకు ఫేమన్ అవుతుందన్నారు. పాలమూరు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతుందన్నారు. జమ్మూ కశ్మీర్లో లిథియం నిల్వలు భారీగా గుర్తించిన నేపథ్యంలో మన లిథియం పరిశ్రమకు మరింత డిమాండ్ వస్తుందన్నారు. రానున్న రెండేండ్లల్లో మహబూబ్నగర్లో 40వేలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకొచ్చిన లిథియం పరిశ్రమపై కాలుష్యం పేరిట దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్, మాజీ చైర్మన్ రాజేశ్వర్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.