మహబూబ్నగర్, జూన్ 22 : తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యే యంగా ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరుల ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని మం త్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలోని అమరవీరుల స్తూపం వద్ద మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డిలతోపాటు పలువురు నేత లు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులపై కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లు అలుపెరగని పోరాటం, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. రాష్ట్రం ఏర్పాటైతే బాగుంటుందని భావించిన మాదిరిగానే నేడు అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సాధించిన ప్రగతిని తెలియజేసేందుకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించామన్నారు.
సంక్షేమం, అభివృద్ధి పోటీపడి రాష్ట్రంలో పరుగులు పెడుతున్నాయని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. ఉద్యమ స మయంలో ఉస్మానియాలో మహిళలపై అసభ్యం గా వ్యవహరించారని, అనేక మందిని కాల్చి చంపిన ఘటనలు ఎంతో అవేదనకు గురిచేశాయన్నారు. పోరాటంలో అడవులకు వెళ్లిన వారిని నక్సలైట్ల పేరిట ముద్ర వేసి గత ప్రభుత్వాలు కాల్చివేశాయని గుర్తుచేశారు. ఎన్నో అవమానా లు, అడ్డంకులు, లాఠీదెబ్బలు ఎదుర్కొని తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించి రాష్ట్రం సాధించుకున్నామని గుర్తుచేశారు. సాధించిన రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధికి అందరి సహకా రం అవసరమన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య, అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్ పాల్గొన్నారు.
కార్పొరేషన్గా మహబూబ్నగర్..
మహబూబ్నగర్ టౌన్, జూన్ 22 : మహబూబ్నగర్ మున్సిపాలిటీ త్వరలో కార్పొరేషన్గా మారనున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మందిరంలో సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అమరవీరులను స్మరించుకొని వారికి ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను గుర్తుచేస్తూ తీర్మానం చేశారు. చైర్మన్ కేసీ నర్సింహులు సభలో ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటిగణేశ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.