పాలమూరు, జూలై 29 : బీఆర్ఎస్ సర్కారు హ యాంలో పండుగ సాయన్నకు సముచిత గౌరవం ల భించిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని వీరన్నపేటలో గల పండుగసాయన్న ఆలయంలో ఉన్న సమాధి వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరన్నపేటకు వచ్చినప్పుడు సా యన్న సమాధిని తొలిసారి సందర్శించి నివాళులర్పించామని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆయన సమాధిని అభివృద్ధి చేశామన్నారు. సాయన్న వారసులను గుర్తించి డబుల్బెడ్రూం ఇండ్లను కేటాయించామన్నారు. విద్యార్హతల మేరకు అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. పండుగ సాయ న్న జీవిత చరిత్రపై ప్రచురించిన పుస్తకాన్ని సచివాలయంలో ఆవిష్కరించామన్నారు. అనంతరం జిల్లా కేం ద్రంలోని పద్మావతి కాలనీలో ఏర్పాటు చేసిన సాయన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, ముడా చైర్మన్ వెంకన్న, కౌన్సిలర్లు కిశోర్, శ్రీనివాస్రెడ్డి, యాసిన్, నాయకులు శ్రీనివాస్యాదవ్, రా మకృష్ణ, బాలు, సాయన్న వారసులు యాదయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్టౌన్, జూలై 29 : మహబూబ్నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, వార్డుల్లో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని భగీరథకాలనీ, బీకేరెడ్డి కాలనీ, శేషాద్రినగర్, మధురానగర్, మైత్రీనగర్లో శనివారం మంత్రి పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రూ. 2.25 కోట్లతో చేపట్టనున్న సీసీరోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులు, వివిధ పనుల కోసం రూ.140 కోట్ల నిధులు ఉన్నాయని, అవసరమైతే మరిన్ని నిధులు తీసుకొస్తామన్నారు. రామయ్యబౌళి, బీకేరెడ్డి కాలనీల్లో నీరు రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. పనులను నాణ్యతతో చేపట్టాలని కాం ట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్లు రష్మిత, ఆనంద్గౌడ్, అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, నా యకులు ప్రశాంత్, మాల్యాద్రిరెడ్డి, జావీద్, అధికారులు పాల్గొన్నారు.
త్యాగానికి ప్రతీక మొహర్రం అని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పాతపాలమూరులోని ఇమామే హుస్సే న్ పీర్లను శుక్రవారం రాత్రి మంత్రి దర్శించుకొని చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వాసం, నమ్మకం కోసం మహ్మద్ ప్రవక్త మనుమడు హజరత్ ఇమామే హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తు చేసుకోవడానికి మొహర్రం వేడుకలను నిర్వహించుకుంటామన్నారు. అనంతరం అలయ్ బలయ్ ఆడారు. మంత్రి వెంట నాయకులు జలీల్, శ్రీనివాస్రెడ్డి, నవకాంత్, వాజీద్ తదితరులు ఉన్నారు.