మహబూబ్నగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘మాకు పొద్దున లేస్తే పాలమూరును ఎట్ల అభివృద్ధి చేయాలె.. ఇంకా ఏమేమి తీసుకురావాలే.. దేశంలోనే జిల్లాకు పేరు రావాలె.. ఇంకా ఏం చేస్తే బాగుంటదన్న ధ్యాస తప్పా వేరే ఊసే లేదు’ అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కొత్త కలెక్టరేట్ వద్ద రూ.477 కోట్లతో చేపడుతున్న భూత్పూర్-కోస్గి-చించోలి బైపాస్తోపాటు నేషనల్ హైవే రహదారి భూమి పూజలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 70 ఏండ్లుగా పాలమూరు అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. ఆనాడు ప్రగతిని ఎందుకు మరిచారని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తే ఇక్కడి ప్రజలు, చిరువ్యాపారులు, రైతులు, సామాన్యులు బాగుపడ్తారని, ఇది ఇష్టంలేని నాయకులు అడ్డుకున్నారని ధ్వ జమెత్తారు. రాజకీయాలు చేస్తే చేయండి కానీ ప్రగతితో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని చేతులెత్తి దండం పె డుతున్నా అంటూ మంత్రి దండంపెట్టి వేడుకున్నారు. గతంలో భారత్మాల వస్తే ఎవరో భూములు ఉన్నాయని ప్రచారం చేశారు? ఇప్పు డు భారత్మాలను బైపాస్కు అనుసంధానిస్తూ ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. మంచి పనిచేసినా అడ్డుతగిలే వాళ్లు అన్ని పార్టీల్లో ఉన్నారని.. ఏదో జరుగుతుందని ట్రోల్ చేస్తూ పబ్బం గడుపుకోవడమే వారి పని అని అన్నారు. ఇప్పుడు మాట్లాడే నాయకులు ఆనాడు ఎందుకు మాట్లాడలేదని.. అభివృద్ధిని ఎందుకు మరిచారో వివరించాలని నిలదీశారు. హైదరాబాద్ దగ్గరుందని జిల్లా అభివృద్ధి కాదని, కృష్ణా జలాలు అంత ఎత్తుకు ఎత్తిపోయలేమని ఆనాడు పెదవి విరిచిన విషయాన్ని గుర్తు చేశారు.
పాలమూరుకొచ్చి బతుకుతామన్న భరోసా కల్పిస్తాం..
ఈ ఎనిమిదేండ్లలో మేం చేసిన, చేస్తున్న అభివృద్ధిని చూసి ఎక్కడో బతకడం కాదు.. పాలమూరుకే బతకనికే వస్తామన్న భరోసా ప్రజల్లో కల్పిస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లా కేంద్రానికి సమీపంలో 2,089 ఎకరాల్లో ఏకో పార్కు, దివిటిపల్లి వద్ద నాలుగు వందల ఎకరాల్లో ఐటీ-ఎనర్జీ పార్కు, మ న్యంకొండ వద్ద తెలంగాణలో తొలి రోప్వే.. భవిష్యత్లో రాష్ట్ర రాజధాని తర్వత ఒక్క మహబూబ్నగర్కే రింగ్రోడ్ వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ఇప్పుడు వేస్తున్న ఈ బైపాస్ జిల్లాకే మణిహారంగా మారడం ఖాయమన్నారు. ఇదే భూత్పూర్ రహదారిని ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టారని, కాంట్రాక్టులు తీసుకుని రోడ్డు నిర్మించకుండా ప్రజలను ఇబ్బందుల పాలు జేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఎనిమిదేండ్లలో జడ్చర్ల నుంచి మహబూబ్నగర్కు నాలుగులేన్ల రహదారి, గేటు పడితే అవస్థలు పడే అప్పన్నపల్లి బ్రిడ్జితోపాటు ఇప్పుడు డబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు చెప్పారు.
లిథియం పరిశ్రమపై విషం కక్కుతున్నారు..
దేశంలోనే అతిపెద్ద లిథియం బ్యాటరీ పరిశ్రమ వస్తుందంటే కొన్ని పార్టీలు విషం కక్కుతున్నాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. కాలుష్యం వస్తది.. అది.. ఇది అని సోషల్ మీడియా వేదికగా ప్రచా రం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ పరిశ్రమ ఇక్కడ వస్తే పదివేల మందికి ఉపాధి లభిస్తుందని, పరోక్షంగా వేల మందికి ఉపాధి ద క్కడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కాలుష్య రహితంగా త యారయ్యే ఎలక్ట్రిక్ బ్యాటరీలపై ఇతం రాద్దాంతం అవసరమా? అని నిలదీశారు. జర్మనీ పర్యటనలో ఉండగా ఈ జిల్లాకు చెందిన నలుగురు నా దగ్గరకు వచ్చి.. పాలమూరులో బ్యాటరీ పరిశ్రమ రాబోతుందా? ఉద్యోగాలు వస్తాయా? అని ఆత్రుతగా ప్రశ్నించారని పేర్కొన్నారు. అవును బిడ్డా.. నిజం.. కాని కొందరు కాలుష్యం అది ఇది అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పానన్నారు. దీనికి వీళ్లు సమాధానం ఇస్తూ కాలుష్య రహితంగా ఉండే ఈ పరిశ్రమపై ఇన్ని పుకార్లు ఎలా నమ్ముతారు? అంకుల్ అంటూ ఉల్టా నన్నే ప్రశ్నించారని మంత్రి చెప్పారు. ఇప్పటి నుంచి ఈ జిల్లాకు నెలకు ఒక అభివృ ద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, ముడా చై ర్మన్ వెంకన్న, కౌన్సిలర్ కిశోర్, బీఆర్ఎస్వీ నేత సుధీప్రెడ్డి ఉన్నారు.