మహబూబ్నగర్ టౌన్, సెప్టెంబర్ 21 : ఆసరా పిం ఛన్ దారులందరికీ వార్డుల వారీగా మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అ న్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎనుగొండ జేజేఆర్ గార్డెన్స్లో 2, 3, 5, 6 వార్డులకు సంబంధించి కొ త్త పింఛన్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చే శారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెలరోజుల్లో మో కాళ్ల శస్త్ర చికిత్స ఉచితంగా చేయిస్తామన్నారు. హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. డబ్బున్న వారికి పింఛన్ల వి లువ తెలియదని.. కానీ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లతో పేద వృద్ధుల మోములో సంతోషం వెల్లివిరుస్తోందని తెలిపారు.
2014కు ముందు మహబూబ్నగర్ పట్టణంలో నెలకు 10 వేల మందికి రూ.31 లక్షల ఫిం చన్లు అందిస్తే తెలంగాణ ఏర్పడ్డాక 19,010 మందికి నెలకు రూ.4.06 కోట్లను పింఛన్ కింద అందిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే ఆసరా సా యం అందేలా చూస్తామన్నారు. అప్పన్నపల్లి మొదటి రైల్వే బ్రిడ్జి పూర్తి చేసేందుకు 12 ఏండ్ల సమయం పట్టిందని, అప్పట్లో ఇండ్లు కోల్పోయిన లబ్ధిదారులకు సరైన న్యాయం జరగలేదన్నారు. కానీ తాము చేపట్టిన రెండో బ్రిడ్జి కేవలం 12 నెలల్లో డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే రూ.500 కోట్లతో పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్స్పెషాలిటీ దవాఖాన పనులను ప్రారంభిస్తామని వివరించారు. పింఛన్లు, డబుల్బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని ప్రజలను ఎవరైనా మో సం చేస్తే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పాలమూరును ఎంతో అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో మరిం త చేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ న ర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, డీసీసీబీ ఉ పాధ్యక్షుడు వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కట్టా రవికిషన్రెడ్డి, మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, నాయకులు జూ పల్లి భాస్కర్రావు, రాజేశ్వర్, కౌన్సిలర్లు వనజ, రా మాంజనేయులు, గోవిందు, మున్సిపల్ కమిషనర్ ప్ర దీప్కుమార్, ఆర్డీవో అనిల్కుమార్, మాజీ కౌన్సిలర్ జ్యోతి, నాయకులు పాల్గొన్నారు.
కొం డా లక్ష్మణ్ బాపూజీ అందించిన సేవలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కా ర్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు లక్ష్మణ్ బాపూజీ 10వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాపూజీ సేవలు ఆచరణీయమని పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, తెలంగాణ ఉద్యమంలో సేవలను గుర్తు చేసుకున్నారు. బాపూజీ క్విట్ ఇండియా, ముల్కి వ్యతిరేక ఉద్యమంతోపాటు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, మున్సిపల్ ఫ్లో ర్లీడర్ రవికిషన్రెడ్డి, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రావు, పట్టణ అధ్యక్షుడు అనంతరాములు, సంఘం నాయకులు సత్యనారాయణ, శం కర్, వెంకటేశ్, ప్రతాప్, సుభాష్ చంద్ర, నాగస్వామి తదితరులు పాల్గొన్నారు.