పాలమూరు, ఏప్రిల్ 9 : ఏసుక్రీస్తు మార్గం అనుసరణీయమని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బోయపల్లి కల్వరికొండపై ఆదివారం నిర్వహించిన ఈస్టర్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరూ ప్రేమ, సహనం, శాంతితో మెలగాలని సూచించారు. రూపాలు వేరైనా అంతిమంగా భగవంతుడు ఒక్కడేనని.. ఒకరిపై ఒకరు ప్రేమతో, దయాగుణంతో వ్యవహరించాలని కోరారు. ఇతరులకు సహాయ సహకారాలు అందించే వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. భవిష్యత్తులో మహబూబ్నగర్ అద్భుతంగా, సంపన్నంగా మారుతుందన్నారు. స్థానికంగానే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పా రు. అనంతరం క్రైస్తవులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు క్రైస్తవులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు.
కులమతాలకు అతీతంగా పాలన
కులమతాలకు అతీతంగా పాలన సాగిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో మైనార్టీలకు 6 గురుకుల పాఠశాలలతోపాటు మరో 6 గురుకుల జూనియర్ కళాశాలలను సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసి అత్యుత్తమ విద్యను అందిస్తున్నామన్నారు. బస్టాండ్ వద్ద ఉన్న చిన్న సమాధులతోట అంత్యక్రియలకు అనువుగా లేదని స్థానిక క్రైస్తవులు ఉమ్మడి రాష్ట్ర పాలకులకు తెలియజేసినా ప్రయోజనం లేకుండాపోయిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యకు పరిష్కారం చూపిస్తూ స్థలం కేటాయించినట్లు తెలిపారు. కల్వరికొండపై ఫ్లోరింగ్ ఏర్పాటుతోపాటు గెస్ట్రూం నిర్మిస్తామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న క్రిస్టియన్ భవన్ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంత రం శిల్పారామం పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్లు జాజిమొగ్గ నర్సింహులు, మోతీలాల్, పాస్టర్ వరప్రసాద్, కోఆప్షన్ సభ్యుడు ప్రభాకర్, డాక్టర్ శామ్యూల్, డేవిడ్, టైటస్పాల్, బెంజి మిన్ తదితరులు పాల్గొన్నారు.