మహబూబ్నగర్/మూసాపేట/పాలమూరు/కోయిలకొండ/మహబూబ్నగర్ అర్బన్/మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 16 : రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పుట్టిన రోజు వేడుకలను మహబూబ్నగర్ నియోజకవర్గ వ్యా ప్తంగా అంగరంగ వైభవంగా అభిమానులు జరుపుకొన్నారు. వేడుకల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారద, కూతురు శ్రీహిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతా నారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, మెడికల్ కిట్లను ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీహిత అందజేశారు. అంతకుముందు సెయింట్ పౌండేషన్ ఆధ్వర్యంలో రాయిల్ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన మహిళల నైపుణ్య శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో శాంతా నారాయణగౌడ్ చారిటబుల్ ట్ర స్ట్ శ్రీహిత హాజరై మాట్లాడారు. 100 రోజుల నైనుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ జన్మదిన వే డుకల సందర్భంగా కేక్కట్ చేసి పంపిణీ చేశారు. హైదరాబాద్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ను టీజీవో సెంట్రల్ అసోసియేట్ ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడలు, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌ డ్ పుట్టిన రోజును పురస్కరించుకొని మూసాపేటలో బీఆర్ఎ స్ నాయకులు కేక్కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్నగర్ పట్టణంలోని ఎదిర జెడ్పీహెచ్ఎస్ మంత్రి శ్రీనివాస్గౌడ్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలోని విద్యార్థుల మధ్య కేక్ కట్టింగ్ నిర్వహించి విద్యార్థులకు పండ్లు, వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. అదేవిధంగా బోయప ల్లి హైస్కూల్ మంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా మహబూబ్నగర్ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం సుందరీకరణ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ జన్మదిన సందర్భంగా పాలకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వెండి కళాశాన్ని మంత్రి దంపతులకు ఆలయ సుందరీకరణ కమిటీ అధ్యక్షుడు చంద్రమౌళి సమర్పించారు.
కోయిలకొండ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలో కేక్కట్ చేసి దవాఖానలో పండ్లు పంపిణీ చేశారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని సరస్వతీ శిశు మందిర్లో నాయీబ్రాహ్మణ సంఘం, అలాగే రజక యువజన సంఘం, రజక యువజన క్రాంతి, కుమ్మర సంఘాల ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రంథాలయ సంస్థ జిల్లా చై ర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా చై ర్మన్ గంజి వెంకట్రాములు, బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాం త్ గౌడ్ కేక్కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.