సమైక్యతా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం వేడుకలను అధికారికంగా చేపట్టడంతో ఊరూరా, వాడవాడనా జాతీయ జెండా రెపరెపలాడింది. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ‘సమైక్యత’ను చాటారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, వనపర్తిలో మంత్రి నిరంజన్రెడ్డి, నాగర్కర్నూల్లో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నారాయణపేటలో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, గద్వాలలో ఉపసభాపతి పద్మారావుగౌడ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి సాధిస్తూ అనతికాలంలోనే అగ్రగామిగా నిలిచామన్నారు.
– మహబూబ్నగర్ నెట్వర్క్ (నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 17
Minister Srinivas Goud | మహబూబ్నగర్, సెప్టెంబర్ 17 : తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనతికాలంలోనే సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను మంత్రి ఎగురవేశారు. అనంతరం విద్యార్థులు చేసిన నృ త్యాలు అలరించాయి. అనంతరం స్వా తంత్య్ర సమరయోధులను శాలువా, పూ లమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి విద్యారంగానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. పాలమూరు కరువును శాశ్వతంగా తొలగించాలన్న ఉద్దేశంతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సమర్థవంతంగా అపర భగీరథుడు సీఎం కేసీఆర్తో ప్రారంభం చేసుకోవడం మన అదృష్టమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, ఎస్పీ నరసింహా, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, అదనపు కలెక్టర్లు మోహన్రావు, యాదయ్య, అదనపు ఎస్పీ రాములు, డీఆర్వో రవికుమార్, ఆర్డీవో అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమానికి పెద్దపీట..
జిల్లాలో గతంలో 2లక్షల 18వేల ఎకరాల సాగు ఉండగా, గడిచిన తొమ్మిదేండ్లలో 3లక్షల 50వేల ఎకరాలకు పెరిగిందన్నారు. జిల్లాలోని 441 గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతున్నట్లు వివరించారు. ఇం దుకు గానూ రూ.330 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ అర్బన్ ఏకో పార్కును 2,087 ఎకరాల్లో ఏర్పాటు చేసుకోవడం గొప్పవిషయ ని తెలిపారు. ఈ ఏడాది 50లక్షలు మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ణయించగా, ఇప్పటికే 33లక్షల మొక్కలను నాటినట్లు పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షా దీ ముబారక్ ద్వారా జిల్లాలో 3,071 మంది కి రూ.283 కోట్ల ఆర్థికసాయం అందించామన్నారు.