వనపర్తి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): సంస్కారం తప్పి మాట్లాడితే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. సమావేశం అనంతరం ఎంపీ రాము లు, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డిలతో కలిసి మంత్రి సింగిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. 40ఏండ్ల్లపాటు తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని, ఈ తొమ్మిదేండ్ల్లలో మాత్రమే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకున్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రజలే తమకు తాము స్వపరిపాలన చేసుకునేలా ఆలోచించాలని, అందుకు అనుగుణంగా భవిష్యత్లో బీఆర్ఎస్ కొనసాగాలన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీదో..వ్యక్తులదో కాదని, ప్రజల విజయంగా నిలుస్తుందని మంత్రి సింగిరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కొందరు సంస్కారం లేకుండా వ్యవహరించినా తాము రెచ్చిపోవడం, సంస్కారం తప్పి మాట్లాడడం జరగదన్నారు. జరిగిన అభివృద్ధిని చూడాలని, మీ మనస్సాక్షిగా ఆలోచించాలని, అభివృద్ధి జరిగిందని మీ మన స్సు అంగీకరిస్తేనే మరింత మెజార్టీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో పరిపాలన సాగుతుందని భవిష్యత్లో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలువాల్సిన అవసరముందని ఎంపీ రాములు పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేండ్ల్లలో సీఎం కేసీఆర్ కరువును పారద్రోలి ఉమ్మడి పాలమూరును పచ్చబడేటుట్లు చేశారన్నారు. కరవు, వలసకు నిలయమైన పాలమూరును అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఎంపీ పేర్కొన్నారు. నియోజవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో నిరంజన్రెడ్డిని గెలిపించాలని ఎంపీ రాములు కోరారు.
నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి మంత్రి సింగిరెడ్డి చేశారని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. అందుకనుగుణంగా ని యోజకవర్గ ప్రజలు గతంలో కంటే భారీ మెజార్టీతో ని రంజన్రెడ్డిని గెలిపించాల్సిన అవసరముందన్నారు. ప నులు అనేకం జరిగాయని, ఇంకా జరుగుతున్నాయ ని, మిగిలిన పనులు పూర్తి కావాలంటే మరోసారి నిరంజన్రెడ్డిని గెలిపించుకోవాలని రావుల పిలుపునిచ్చారు.
కాంగ్రెస్లో ఆయోమయం నెలకొందని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి దుయ్యబట్టారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల పార్టీలోకి వచ్చిన ఐదుగురికి టికెట్లు ఇచ్చారని నాగం ఉదహరించారు. నాగర్కర్నూల్ పార్లమెంట్లో రెండు చోట్ల మినహా అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో పడిందన్నారు. గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్కర్నూల్ అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఇచ్చిన వారంతా కాంగ్రెస్కు సంబంధం లేని వారేనన్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ను తుంగలో తొ క్కిన కాంగ్రెస్ విధానాలు ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని నాగం విమర్శించారు. 59మంది ఎ మ్మెల్యేలు గెలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో కాంగ్రెస్ లేదని ఆ పార్టీలో ఉన్న నాయకులే చెబుతుండటం చూస్తే…కాంగ్రెస్ ఎంత అయోమయంలో ఉందో అర్థమవుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా తెలంగాణలో అమలు అవుతున్నాయన్నారు. రైతు ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుందని మరోమారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా కొన్ని ప్రాజెక్టుల పనులు ఉన్నాయని, వాటిని పూర్తి చేసుకోవాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన కొనసాగాలని నాగం పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, సీనియర్ నాయకులు నాగం తిరుపతిరెడ్డి, నందిమళ్ల అశోక్, రమేశ్, శ్యాం, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి,నవంబర్ 7: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నాచహళ్లి మాజీ సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో నలుగురు, ఖాసీంనగర్ నుంచి రేవల్లి రాము ఆధ్వర్యంలో 17మంది, బండరావిపాకుల నుంచి మరో 10మంది కాంగ్రెస్, ఇతర పార్టీ నాయకులు,కార్యకర్తలు మంత్రి నిరంజన్రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి సమక్షంలో మంగళ వారం బీఆర్ఎస్లో చేరారు. ముందుగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, బీఆర్ఎస్ శిక్షణ తరగతుల కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.