HomeMahabubnagarMinister Singireddy Niranjan Reddy Distribution Of Scooties To The Disabled
నా జీవితం ప్రజాసేవకే అంకితం
వ్యవసాయ రంగానికి శాశ్వతంగా సాగునీరందించడమే లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ముం దుకెళ్తుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం రూ. 31.60కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బాచారం హైలెవల్ కెనాల్ పనులకు యాపట్ల వద్ద ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
వనపర్తిని కోనసీమగా చేశాం
సీఎం కేసీఆర్ వెన్నంటే ఉంటా..
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
దివ్యాంగులకు స్కూటీల పంపిణీ
వనపర్తి, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల్లో పర్యటన
కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి, అక్టోబర్ 4 : వ్యవసాయ రంగానికి శాశ్వతంగా సాగునీరందించడమే లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ముం దుకెళ్తుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం రూ. 31.60కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బాచారం హైలెవల్ కెనాల్ పనులకు యాపట్ల వద్ద ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పెద్దకొత్తపల్లి మండలంలో చాలా కాలంగా రైతాం గం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన పనుల్లో ఒకటి బాచా రం హైలెవల్ కెనాల్కు రూ.31.60 కోట్ల వ్యయంతో పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. అనేక సంత్సరాలుగా ప్రధానంగా రైతాం గం, ప్రజలు ఏడు, ఎనిమిది గ్రామాలకు సాగునీరు లేక కృష్ణానది ఆమడదూరంలో ఉన్న సాగునీటికి రైతాంగం నోచుకోకపోవడం విషయాన్ని ఎమ్మెల్యే బీరం ముఖ్యమంత్రి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారన్నారు. కొన్ని సందర్భాల్లో తాను కూడా సీఎం కేసీఆర్కు వివరించినట్లు చెప్పారు.
ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి ప్రత్యేక కృషితో ఇవాళ బాచారం హైలెవల్ కెనాల్కు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. 5,900 ఎకరాలు, 8గ్రామాలు, రూ.31.60కోట్లతో అంచ నా వ్యయంతో ఆ పనులకు ఇవాళ శ్రీకారం చుట్టినట్లు మంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన వెంటనే భూసేకరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామని, సర్వే అనంతరం పనులు ప్రారంభమవుతాయని మంత్రి వివరించారు. అదేవిధంగా నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఉమ్మడి పాలమూరు నుంచే కాకుండా కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ.5 కోట్లు మంజూరు చేయడంతో వాటితో భక్తుల కోసం ప్రత్యేక మండపాన్ని నిర్మించుకొని ఇవాళ ప్రారంభించుకున్నామన్నారు. భవిష్యత్లో ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుకొని అన్ని వసతులు కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం : బీరం
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పెద్దకొత్తపల్లి మండలంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాం. మండల కేంద్రానికి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరు చేస్తూ ఈరోజే ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నో అవకాశాలున్న గతంలో ఉన్న నాయకుడు తన స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాడని మాజీ మంత్రి జూపల్లిని ఉద్దేశించి ఆరోపించారు. ఈరోజు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి అడిగిన వెం టనే అన్ని అభివృద్ధి పనులను మంజూరు చేస్తూ కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్నాయక్, మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, పెద్దకొత్తపల్లి ఎంపీపీ భోజ్యానాయక్, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్రావు, మాజీ జెడ్పీటీసీ సింగారం వెంకటయ్యయాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు గణేశ్రావు, రాంచందర్యాదవ్, రాజశేఖర్గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చివరి ఆయకట్టుకు నీళ్లందిస్తాం..
కోడేరు, అక్టోబర్ 4 : ఎంజీకేఎల్ఐ పసుపుల-పాన్గల్ బ్రాంచి కెనాల్ ద్వారా చివరి ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అందిస్తామన్నారు. బుధవారం సాయంత్రం కోడేరు శివారులోఉన్న పసుపుల-పాన్గల్ బ్రాంచ్ కెనాల్ సి మెంట్ లైనింగ్ పనులకు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతం లో నిర్మించిన పసుపుల పాన్గల్ బ్రాంచి కాల్వ ద్వా రా చివరి ఆయకట్టు రైతుల పొలాలకు సాగునీళ్లు వెళ్లడం లేదని దీంతో రైతులు పొలాలకు నీళ్లు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు సమస్యలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా కొల్లాపూర్ సభలో రైతులకు ఇచ్చిన మాటప్రకారం బ్రాంచి కాల్వ సిమెంట్ లైనింగ్ పనులకు అవసరమైన నిధులను మంజూ రు చేశారన్నారు. ఇప్పటికే మంజూరైన రూ.60 కోట్ల నిధులతోపాటు అదనంగా మరో 30శాతం నిధులను పెంచే అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం బ్రాంచి కాల్వ వద్దలో మంత్రి, ఎమ్మె ల్యే బీరం కృష్ణా జలాలకు పూలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘువర్ధన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, విండో డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు జగదీశ్వర్రావు, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, ఇంజి నీరింగ్ అధికారులు, నాయకులు పాల్గొనారు.
నా జీవితం ప్రజాసేవకే అంకితం
వనపర్తి, అక్టోబర్ 4 : ఈ జీవితం ప్రజాసేవకే అంకితమని, తనను గెలిపించిన ప్రజలకు తన లో శ్వాస ఉన్నంత వరకు వారికి సేవలందిస్తానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి 65వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు పెద్దఎత్తున తరలివచ్చి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనకోసం వ్యయ ప్రయాసాల కోర్చి జన్మదిన శుభాకాంక్షాలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రధానంగా మలి దశ ఉద్యమం నుంచి కేసీఆర్ వెన్నటి నడి చానన్నారు. సాధించుకున్న తెలంగాణలోని ప్రజల బతుకులు, ఎడారైన ఈ నెలను ఎలా పచ్చపర్చాలో అనే ఆలోచనలతో నా రాజకీ యం జీవనం సాగిందన్నారు. ఆ ఆలోచనకు కేసీఆర్ అన్నింటా తాను వెనుక ఉండి నన్ను ముం దుకు నడిపి నేడు నా నియోజకవర్గంలోని ప్రతి పల్లెను పచ్చగా చేసిండన్నారు. ఆయన చలువతోనే నేడు అనేక రిజర్వాయర్లు, చెక్ డ్యాంలు, మినీ లిఫ్ట్లు ఏర్పాటు చేసుకొని కోనసీమగా చేసుకున్నామన్నారు. అదేవిధంగా జిల్లాను విద్యా,ఆరోగ్యంలోనూ ముందుంచాలన్న తపన తో జిల్లాకు మెడికల్, నర్సింగ్, వ్యవసాయ, ఇం జినీరింగ్, మత్స్య కళాశాలలను తీసుకొచ్చామన్నారు. మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 8 మంది దివ్యాంగులకు సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా స్కూటీలను మంత్రి అందజేశారు. అంతకుముందు క్యాంప్ కార్యాలయంలో 70 మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ తో పాటు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.