ఖిల్లాఘణపురం, ఫిబ్రవరి 16 : ఎంజీకేఎల్ఐ సాగునీరు వచ్చాక గ్రామాల్లో ఎటు చూసినా పచ్చని పం ట పొలాలతో సస్యశ్యామలంగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో మంత్రి పల్లెనిద్ర చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మంత్రి కి స్థానికులు ఘన స్వాగతం పలికారు. గ్రామ సమీపంలోని రెడ్డి చెరువు వద్ద ఆంజనేయస్వామి ఆలయంలో దేవతామూర్తులను దర్శించుకున్నారు. మంత్రి మాట్లాడుతూ ఆం జనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు సా యంగా రూ.20 లక్షలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆ లయ ప్రహరీ, సామూహిక భవనం నిర్మించాలని సూచించారు. ఆలయ అభివృద్ధి కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను సన్మానించారు. గ్రామస్తులతో స మావేశమై సమస్యలను తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం మంత్రి గ్రామంలో పర్యటించనున్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.