ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తున్న సీఎం కేసీఆర్పై విపక్షాలు కారుకూతలు కూస్తే సహించం.. ఖబడ్దార్ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విపక్షాలను హెచ్చరించారు. సోమవారం పెద్దమందడి మండలం వెల్టూర్ గోపాలసముద్రం వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ రవీందరావుతో కలిసి మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోనే జిల్లాను నీళ్లు, నిధులు, విద్యలో ముందంజలో ఉంచామని, 700ఏండ్ల కిందట నిర్మించిన గణపసముద్రం, వనపర్తి రాజులు నిర్మించిన గోపాలసముద్రాన్ని పునరుద్ధరిస్తున్నామని, ఇవన్నీ చరిత్రలో నిలిచిపోతాయన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో శాశ్వత అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలోనే ఎక్కువగా సీసీరోడ్లు వేసిన నియోజకవర్గం వనపర్తి అని మంత్రి వివరించారు. వేలాదిగా తరలివచ్చి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. స్వప్రయోజనాల కోసం పార్టీ మారిన వారిని తరిమికొట్టాలని జిల్లా ఇన్చార్జి రవీందర్రావు అన్నారు. పక్కరాష్ర్టాల అభివృద్ధిని తెలంగాణతో పోల్చిచూస్తే ప్రతిపక్షాలకు అభివృద్ధి తెలుస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు.
– మహబూబ్నగర్, మార్చి 20 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/పెద్దమందడి/గట్టు
మహబూబ్నగర్, మార్చి 20 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/పెద్దమందడి : రాష్ట్రంలోని వనపర్తి జిల్లాను నీళ్లు, విద్య, నిధుల్లో ముందుంచామని వ్యవసాయశాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం పెద్దమందడి మండలం వెల్టూర్ గోపాలసముద్రం వద్ద ఏ ర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడా రు. 700ఏండ్ల కిందట నిర్మించిన గణపసముద్రం, వనపర్తి రాజులు నిర్మించిన గోపాలసముద్రాన్ని పునరుద్ధరిస్తున్నామని.. ఇవి చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే వనపర్తి ని యోజకవర్గంలో 70వేల ఎకరాలకు సాగునీరు అందించాకే గత ఎన్నికల్లో నామినేషన్ వేసినట్లు మంత్రి గుర్తుచేశారు. పెద్ద ఎత్తున చెక్డ్యాంల నిర్మాణాలను పూర్తిచేశామని, గ్రామాలు, తండాలకు, సీసీ, బీటీ రోడ్లను ని ర్మించామన్నారు. రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువగా సీసీరోడ్లు వేసిన నియోజకవర్గం వనపర్తి అని మంత్రి వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కరెంట్, సా గునీరు, గురుకులాలు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పథకాలు ఎందుకు లేవన్నారు. అన్నీ ఇచ్చిన కేసీఆర్ అగ్గువకు దొరికాడని విపక్షాలు కారుకూతలు కూస్తున్నాయి ఖబడ్దార్ అని మంత్రి హెచ్చరించారు.
దేశంలోనే మొదటిసారిగా వనపర్తిలో బాలికల గురుకుల వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేశామని, ఏ రాష్ట్రంలో లేనివిధంగా 46లక్షల కుటుంబాలకు ఆసరా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక సీఎం కేసీఆర్ అని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగుతామని, ఇప్పటివరకు నియోజకవర్గంలో 3వేల ఇండ్ల నిర్మాణం పూర్తయ్యిందని, మరో 3వేల ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. చేతికి శస్త్రచికిత్స జరిగి వైద్యులు 45రోజులు విశ్రాంతి తీసుకోమన్నా మూడు రోజులు విశ్రాంతి తీసుకున్నానని, కేసీఆర్ నాయకత్వంలో చైతన్యవంతమైన సమాజం నిర్మాణమయిందన్నారు. కానాయపల్లి నుంచి పెద్దమందడి చెరువుకు లిఫ్ట్ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
అభివృద్ధిలో ముందంజ : రవీందర్రావు
దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉంద ని ఎమ్మెల్సీ, వనపర్తి జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. గడపగడపకూ తాగునీరు అందిస్తున్నామని, గత ప్రభుత్వాలు ఎందుకు అందించలేదో వారికే తెలియాలన్నారు. నాడు వలసలు వెళ్లిన పాలమూరుకు ఇతర రాష్ర్టాల కూలీలు వలసొస్తున్నారని, తాగు, సాగునీరు, కరెంట్ పంచాయితీలు తెలంగాణలో లేవన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అన్నివర్గాలకు అందుతున్నాయన్నారు. 75ఏండ్లు నష్టపోయిన తెలంగాణ నేడు సుభిక్షమవుతున్నదని, వనపర్తి జిల్లా అయ్యిందని, ఎం తో అభివృద్ధి చెందుతుందన్నారు.
దేశంలో ఇంత అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీలు మారిన వారిని తరిమికొట్టాలన్నారు. అభివృద్ధి చేస్తున్న పార్టీని, నేతలను ప్రజలు ఆశీర్వదించాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, బుక్క మోహన్బాబు, జెడ్పీటీసీలు రఘుపతిరెడ్డి, రాజశేఖర్రెడ్డి, మార్కెట్కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, మండల వైస్ప్రెసిడెంట్ రఘుప్రసాద్, పార్టీ మండలాధ్యక్షుడు వేణుయాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజుప్రకాశ్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు.