వనపర్తి రూరల్, ఏప్రిల్ 22 : చెక్డ్యాంల నిర్మాణంతో భూ గర్భజలాలు పెరిగాయని, దీంతో రైతులకు ఊరట లభిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పెద్దగూడెం గ్రామ శివారులో ని అటవీ ప్రాంతంలో చేపట్టిన చెక్డ్యాం నిర్మాణా న్ని శనివారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దగూడెంలో నీటి నిల్వలు లేక సాగు చే సేవారు కాదని, నేడు పుష్కలం గా నీరందుతుండడంతో పం టలు కళకళలాడుతున్నాయన్నారు. బోర్లు, బావులకు జీవం వచ్చేలా ఎక్కడికక్కడ అవసరైమన చోట చెక్డ్యాంల నిర్మాణాలను చేపడుతున్నామన్నారు.
ఈద్గా కంపౌడ్ వాల్ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేశామన్నారు. రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదన్నారు. రాష్ట్రంలో హిందూ, ముస్లింలు ప్రతి పండుగలను తారతమ్య బేధం లేకుండా జరుపుకొంటున్నారని తెలిపారు. అనంతరం గ్రామంలో ఐకేపీ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మం త్రి ప్రారంభించారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వే ణుగోపాల్, తాసీల్దార్ రాజేందర్గౌడ్, బీఆర్ఎస్ శిక్షణ తరగతుల జిల్లా కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, సర్పంచ్ కొండన్న, గొ ర్రెల కాపరుల సంఘం జిల్లా చైర్మన్ కురుమూర్తియాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాణిక్యం, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నరసింహ, ఎంపీటీసీ ధర్మానాయక్, బీఆర్ఎస్ యూత్ మండల కార్యదర్శి గణేశ్, నాయకులు అశోక్, ప్రేమ్నాథ్రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, అలీం తదితరులు పాల్గొన్నారు.