వనపర్తి టౌన్, జూన్ 14 : రాష్ట్రంలోని ప్రతి పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లాకేంద్రంలోని కల్యాణసాయి ఫంక్షన్హాల్లో జరిగిన వైద్య, ఆరోగ్య దినోత్సవ వేడుకలకు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానలు, పట్టణాల్లో బస్తీ దవాఖానలు, జిల్లా దవాఖానలను జనరల్ వైద్యశాలలుగా మారుస్తూ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మెడికల్ కళాశాల, ఎంసీహెచ్ ఏర్పాటు చేసి వైద్య సేవలను విస్తృతం చేశామన్నారు.
సర్కారు దవాఖానల్లోనే అత్యధికంగా ప్రసవాలు అయ్యేలా సేవలందిస్తున్నట్లు చెప్పారు. వైద్య సేవల్లో, పారిశుధ్య అంశంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్వో వెయ్యి మందికో డాక్టర్ ఉండాలని సూచించిందని, రాష్ట్రంలో ప్రస్తుతం 900 మందికి ఒక డాక్టర్ చొప్పున నియమించామన్నారు. ఇది ఎంతో శుభపరిణామమని చెప్పారు. ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ఎన్నో సేవలు అందిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వైద్య సేవలు అందించడంలో రష్యా, క్యూబా, స్పెయిన్ వంటి దేశాల సరసన భారత్ చేరుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
వనపర్తి మెడికల్ కళాశాలలో 150 మంది విద్యార్థులు ఈ ఏడాది మొదటి సంవత్సరంలో విద్యను అభ్యసిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు, మంత్రి నిధులతో జిల్లాకు 7 అంబులెన్స్ సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ దవాఖానలోల 57 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నామని వివరించారు. అనంతరం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ జిల్లాకు మెడికల్, నర్సింగ్ కళాశాలను మంజూరు చేసినందుకు మంత్రి నిరంజన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంసీహెచ్లో చిన్న పిల్లల్లో వచ్చే వ్యాధులకు నిపుణులైన డాక్టర్లచే సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
గతంలో ప్రతి నెలా 200 డెలివరీలు జరిగేవని, ప్రస్తుతం 400కుపైగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. జనరల్ దవాఖానలో బ్లడ్బ్యాంక్, డయాలసిస్, డయాగ్నొస్టిక్ సేవలతోపాటు 57 రకాల పరీక్షలు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను మంత్రి ప్రారంభించి ‘మహిళా ఆరోగ్యం-ఇంటికి సౌభాగ్యం’ బ్రోచర్స్ను ఆవిష్కరించారు. పీహెచ్సీలకు అందించనున్న బీపీ మిషన్లను మంత్రి ప్రారంభించారు. అలాగే వైద్య శాఖలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అంతకుముందు జనరల్ దవాఖానలో క్యాన్సర్ కేర్ కీమోథెరపీ కేంద్రాన్ని, వయోవృద్ధుల, ఎన్సీడీ క్లినిక్లు, చిన్న పిల్లల కౌన్సెలింగ్ కేంద్రాన్ని, బ్లడ్ డొనేషన్ క్యాంపులను మంత్రి ప్రారంభించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, సూపరింటెండెంట్ నరేందర్కుమార్, మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ సునందిని, డీఎంహెచ్వో రవిశంకర్, రాజ్కుమార్ పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన..
గోపాల్పేట / పెద్దమందడి, జూన్ 14 : తం డాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బు ధవారం మండలంలోని కర్నమయ్యకుంట తండా, పాటిగడ్డ తండా, లక్ష్మీతండాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న గ్రామ పం చాయతీ భవన నిర్మాణాలకు శంఖుస్థాపన చే శారు. కర్నమయ్యకుంట బీటీరోడ్డు నుంచి గోప్యాతండా వరకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. పొల్కెపహాడ్కు చెందిన రైతు జి. అమరేందర్రెడ్డిని మంత్రి సన్మానించారు. పెద్దమందడి మండలం జంగమాయిపల్లి గ్రా మ పంచాయతీ భవన నిర్మాణ పనులకు, నందగోపాల యాదవ కమ్యునిటీ షెడ్డు నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేసి ప్రారంభించారు.