వనపర్తి అర్బన్,ఆగస్టు 20 : జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్ష కేంద్రంలో ఆదివారం ఒకేరోజు 32 కాన్పులు చేసినట్లు ప్రొఫెసర్, హెచ్వోడీ అరుణకుమారి తెలిపారు. గతంలో జిల్లా కేంద్రంలో ఎంసీహెచ్వో 28కాన్పులు చేసిన రికార్డు ఉందని, దానిని ఈ రోజు అధిగమించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలకు అనుగుణంగా వచ్చే బాధితులకు తమవంతుగా సహకారం అందిస్తుమన్నారు. సాధ్యమైనంతవరకు సాధారణ కాన్పులు చేస్తున్నా మని, తప్పనిసరి పరిస్థితులలో సెక్షన్ చేస్తున్నామన్నారు.
ముందుగా కాన్పుకు 13మంది వచ్చారని, వారిలో 9మందికి నార్మల్ కాన్పు అయిందని, 4 సెక్షన్ చేయాల్సి వచ్చిందన్నారు. ఇప్పటివరకు జరిగిన 32 కాన్పుల్లో తల్లిబిడ్డలు క్షేమంగానే ఉన్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి నిరంజన్రెడ్డి వైద్య సిబ్బందిని ప్రకటనలో అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కిరణ్మయి, అసోసియేట్ ప్రొఫెసర్ జరుషా, గైనాకాలజిస్ట్ అరుణజ్యోతి, సోని తదితరులు పాల్గొన్నారు.