మరికల్ (ధన్వాడ), జనవరి 23 : జిల్లాకేంద్రంలో మం గళవారం పర్యటించనున్న మంత్రి కేటీఆర్ సభకు ధన్వాడ మండలం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, సినీయర్ నా యకుడు రాజవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలో ముఖ్యకార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, యువకులు, మహిళలు అధికసంఖ్యలో తరలిరావాలన్నా రు. సమావేశంలో యువజన విభాగం మండల అధ్యక్షుడు సునీల్రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అధికసంఖ్యలో తరలిరావాలి
జిల్లాకేంద్రంలో మంగళవారం జరగనున్న మంత్రి కేటీఆర్ బహిరంగ సభ కు నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలిరావాల ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాములు, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అధ్యక్షతన మినీ స్టేడియంలో జరగను న్న బహిరంగ సభకు మంత్రులు కేటీఆర్తోపాటు మహమూద్అలీ, వేము ల ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, ని రంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు హాజరవుతున్నారన్నారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమాను లు అధికసంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలన్నారు.
విజయవంతం చేయాలి
మంత్రి కేటీఆర్ సభను విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎంపీపీ బక్క నర్సప్ప అన్నారు. మండలంలోని పటేల బసంత్రాజ్ ఇంట్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి కార్యకర్త జనాలను సభకు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ భీమయ్యగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అశోక్గౌడ్, సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భారీగా తరలిరావాలి
జిల్లాకేంద్రంలో మంగళవా రం మంత్రి కేటీఆర్ పర్యటన కార్యక్రమానికి మక్తల్ నుంచి బీఆర్ఎస్ నాయకులు అధికసంఖ్యలో రావాలని మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అమరేంధర్రెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. పేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి ముఖ్యఅతిథిగా వ స్తున్నారన్నారు. పర్యటనను విజయవంతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు.