రూ.157.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ముఖ్యకార్యకర్తల సమావేశంలో బీరం హర్షవర్ధన్రెడ్డి
కొల్లాపూర్ రూరల్, జూన్ 14: ఈ నెల 18న కొల్లాపూర్లో జరిగే కేటీఆర్ బహిరంగ సభకు కొల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలనుంచి అత్యధికంగా ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తరలిరావాలని బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కొల్లాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.
కొల్లాపూర్ మండలం శ్రీవారి సముద్రంనుంచి గోపల్దిన్నె రిజర్వాయర్వరకు గ్రావిటీ కాలువ నిర్మాణం కోసం రూ.147.10 కోట్ల విలువగల పనులకు, కొల్లాపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో రూ.10.30 కోట్ల విలువగల పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. పెంట్లవెల్లిలో నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి కేటీఆర్ భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, సింగిల్విండో చైర్మన్లు, పార్టీ పట్టణ, తాలూకా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.