‘దేశంలో ఇప్పటి వరకు ఇంత అసమర్థుడైన మోదీ లాంటి ప్రధాని ఎవరూ లేరు. ధరలు మండిపోతున్నాయి.. సిలిండర్ ధర ఆకాశన్నంటింది.. పొద్దున లేస్తే చాలు ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.. బీజేపీ నాయకులవి దద్దమ్మ మాటలు.. పనికి మాలిన డైలాగులు’.. అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో రూ.196 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
సాయంత్రం నిర్వహించిన ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దమ్ముంటే కేంద్ర బడ్జెట్ సెషనల్లోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి చిత్తశుద్ధి చాటుకోవాలని సూచించారు. రాష్ర్టాలు విడిపోయి ఎనిమిదేండ్లయినా ఇంకా కృష్ణా నీటి వాటా ఎందుకు తేల్చడం లేదని నిలదీశారు. కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సకల హంగులతో నిర్మించి కానుకగా అందిస్తామన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడి గులాబీ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.
మహబూబ్నగర్, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘తెలంగాణ వస్తే ఏమొస్తది అన్నారు.. నారాయణపేట జిల్లా అయింది.. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నిధుల వరద పారిస్తున్నాడు.’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రం లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థానలు. ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నారాయణపేట జిల్లాలో అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ భవనాలను త్వరలో నిర్మించి కానుకగా ఇస్తామని ప్రకటించారు. రూ.8 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటేడ్ మార్కెట్ చూస్తుంటే మంత్రి నిరంజన్రెడ్డి… ఈ డిజైన్ బాగుంది.. వనపర్తిలో కట్టడానికి ఇంత జాగలే దు అని అన్నారని గుర్తు చేశారు. మంత్రులు సైతం అసూయపడేలా పేటలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కొండారెడ్డిపల్లి చెరువుకు పోతుంటే దారికూడా సరిగ్గా ఉండేది కాదు.. కానీ ఇవాళ బ్రహ్మాండంగా అక్కడ ట్యాంక్బండ్ పనులు జరిగినయ్.. అని కితాబునిచ్చారు. లైట్లలో చక్కటి రహదారి నిర్మాణం, బతుకమ్మ, గణేశ్ నిమజ్జనం ఘాట్లు నిర్మించడం అభినందనీయమన్నారు.
రాష్టంలో ఎక్కడా లేని విధంగా సీనియర్ సిటిజన్ పార్కు.. సైన్స్ పార్కు ఏర్పాటు చేసిన ఘనత ఎమ్మెల్యే కు దక్కిందన్నారు. చిన్న జిల్లా అయిన నారాయణపేటకు అన్ని హంగులు ఉండాలె.. పెద్ద జిల్లాలతో పోలిస్తే దీటుగా ఉండాలనే దృఢ సంకల్పంతో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కొద్ది నెలల్లోనే కలెక్టర్, ఎస్పీ భవనాలు పూర్తి చేస్తామన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో రామాలయ నిర్మాణానికి రూ. 10 కోట్లు అడిగితే సీఎం కేసీఆర్ వెంటనే మంజూరు చేశారన్నారు. అదే విధంగా రూ.2 కోట్లతో ఈద్గా నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంటిగ్రేటేడ్ మండల కార్యాలయాలు నిర్మించడం లేదు.. కానీ మరికల్లో మండల కాంప్లెక్స్కు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ఏం జరిగింది.. ఏం జరుగబోతుందనేది కండ్లకు కట్టినట్లు మీకే కనిపిస్తుందన్నారు.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వెళ్లి జిల్లా కేంద్రంలో మార్పు వచ్చిందా? అని ఆడబిడ్డలను ప్రశ్నించానన్నారు. రోడ్లు బాగా అయ్యాయని, రోడ్ల మధ్యలో చెట్లు పెట్టిండ్రని, మంచి మార్కెట్, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, మి నీ ట్యాంకుబండ్, కొత్త పార్కులు, చేనేత సమూహాలు నిర్మించారని చెప్పారన్నారు. జిల్లాకు ఒక మెడికల్, నర్సింగ్ కాలేజీ వస్తున్నందంటే అది కేసీఆర్ ప్రభుత్వం వల్లే అని అన్నారు. ఎనిమిదిన్నర ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం ఒక్క విద్యాసంస్థను కూడా ఇవ్వలేదని విమర్శించారు. జన్ధన్ ఖాతాలు తెరవండి.. ప్రతి ఒక్కరికీ రూ.15లక్షలు వేస్తాం అని అన్నారు.. మీకు వేశారా? అని ప్ర జలను ప్రశ్నించారు.
బీజేపీ నేత నాగురావు నామాజీ ఖాతాలో పడ్డాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇ లాంటి అసమర్థులకా మీరు సమర్థించేది అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో పేట జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిని మ ల్లోసారి అఖండ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మంత్రులతోపాటు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, అబ్రహం, జైపాల్యాదవ్, బండ్ల కృష్ణ మోహన్రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ ని జాంపాషా, జెడ్పీ చైర్మన్ వనజ, కార్పొరేషన్ చైర్మన్లు సా యిచంద్, ఇంతియాజ్ ఇసాక్, కొలేటి యాదయ్య, నాయకులు ఉన్నా రు.
దేశం, ధర్మం కోసం కాదు.. అదానీ, అంబాని కోసమే..
బీజేపోళ్లు దేశం కోసం.. ధర్మం కోసం అంటారు.. వీళ్లు మాత్రం అదానీ, అంబాని కోసమే దేశాన్ని నడుపుతున్నారని మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆదాయం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నష్టం వస్తుందని ఈ ఇద్దరికి దారాదత్తం చేసి చివరకు ఈ ఇద్దరు మా కంపెనీలు లాస్ అయ్యాయని కేంద్రాని కి విన్నవిస్తే వీళ్ల అప్పులు మాఫీ అయిపోతున్నాయ న్నారు. ఈ ఎనిమిదేళ్లలో కార్పొరేట్ కంపెనీలకు రూ. 12 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారని, ఇది అబద్ధమై తే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఇవే డబ్బులు గనుక పెడ్తే దేశవ్యాప్తంగా రైతులకు 10 ఏండ్ల పాటు ఉచితంగా కరెంట్ ఇవ్వొచ్చన్నారు. సంవత్సరానికి లక్ష కోట్లు మాత్రమే అవుతాయని.. ఈ పనిని చేయని కేంద్రం ఉన్నోళ్లకు దోచిపెడుతుందన్నారు. 20 22 నాటికి బీదోళ్లకు ఇండ్లు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీలు ఇచ్చి అందరి నోళ్లల్లో మట్టి కొ డుతుందన్నారు. ప్రధాని సలహాదారు వి వేక్ దుబారాయ్ ఒక ఇంగ్లిష్ పేపర్లో ఆ ర్టికల్ రాసిండు.. రైతులకు ఆదాయ పన్ను వేయాలట.. ఇంతకన్న దుర్మార్గం ఏమన్నా ఉందా..? రైతులకు ఇచ్చేది పోయి రైతులకు ఆదాయాన్ని పెంచేది పోయి పన్ను వసూలు చేయాలనే దుర్మార్గమైన ఆలోచన కేంద్రం చేస్తుందనడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు.
హ్యాట్రిక్ కొట్టాలని దీవించండి..
ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. పరీక్షలు ఎప్పుడొచ్చినా.. పనిమంతులకు పట్టం కట్టాలని, కేసీఆర్ నాయకత్వంలో తిరిగి హ్యాట్రిక్ కొట్టే విధంగా మీ అందరి తీర్పు ఉండాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వీళ్లందరినీ మట్టి కరిపించి 2024లో మనకు అనుకూలంగా కేంద్రంలో వచ్చే విధంగా చేసుకుందామన్నారు. రైతు వ్యతిరేకులకు, పేదల వ్యతిరేకులను పేదల కడుపుకొ ట్టి పెద్దలకు పెట్టే దుర్మార్గ ఆలోచన చేసేవాళ్లకు, ప్రజల మధ్య, మతాల చిచ్చు పెట్టి లేని పోని పంచాయితీలు పెట్టి నాశనం చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్లను తిప్పితిప్పి కొట్టాలని పిలునిచ్చారు. మాట్లాడితే మత చిచ్చు ఎందుకు పెడ్తున్నారంటే.. దేశంలో ఇంతవరకు ఇంత అసమర్థ మోదీ లాంటి ప్రధాని రాలేదు.. ధరలు మండిపోతున్నాయి.. సిలిండర్ ధర ఆకాశన్నంటిందని విమర్శించారు.
నీకెందుకు ఓటేయాలో చెప్పు.. : మంత్రి కేటీఆర్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మోకాలడ్డినందుకు నీకు ఓ ట్లేయ్యాల్నా..? కృష్ణానదిలో మా వాట తేల్చకుండా నోట్లో మట్టికొట్టినందు కు ఓట్లేయ్యాల్నా..? ఎందుకెయ్యాలే నీకు ఓటు అని మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ మాట అడిగితే బీజేపీ నేతలు తిట్ల దండకం, బూతుపురాణం అం దుకుంటున్నారు.. ఇక్కడో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడున్నరు.. ఆయన మోదీ దేవుడయ్యా దేవుడు.. అంటాడు.. ఎవరికి దేవుడు? అని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు అడిగితే చెప్తారు.. మోదీ ఎసొంటోడో.. గ్యాస్ ధర 2014లో రూ.400. ఇయ్యాల రూ.1,200.. సిలిండర్ ధర పెంచి కట్టెలపొయ్యి చేసినందుకు దేవుడా..? అని నిలదీశారు. మా తమ్ముళ్లు చెప్పాలే మోదీ రాకముందు లీట ర్ పెట్రోల్ ధర రూ.70.. ఇయ్యాల రూ.110.. పెట్రోల్ ధర పెంచినోడు దే వుడా..? ముడిచమురు ధర మారలే.. ఇంకా తగ్గింది.. కానీ పెట్రోల్ ధర మాత్రం పెరిగింది.. అని దుయ్యబట్టారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నరేంద్రమోదీ పోటీ చేస్తున్నారని విన్నాను.. ఆయన ఇక్కడకు వచ్చి ఏం మొఖం పెట్టుకొని ఓట్లగుతాడో ప్రజలకు చెప్పాలన్నారు.
ప్రతిపక్ష నాయకులు కంటి పరీక్షలు చేసుకోవాలి..
బీఆర్ఎస్ హయాంలో నారాయణపేట జి ల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. జిల్లాగా ఏర్పడితే ఏమవుతుందని అందరూ వి మర్శించారు. అందుకు నిధుల వరుదే సమాధానం చెబుతుంది. సిరిసిల్ల జిల్లాలో కూడా లేని విధంగా అన్ని హంగులతో ఆధునిక కూరగాయలు, మాంసాహార మార్కెట్ను ప్రారంభించుకున్నాం. కోయిల్కొండలో రామాల యం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయి. జిల్లా ప్రజలకు నిత్యం శుద్ధజలం అందిస్తున్నాం. అడిగిన వెంటనే ధన్వాడకు డిగ్రీ కళాశాల, పేటకు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. జిల్లా కేంద్రంలో వం ద పడకల పిల్లల దవాఖాన, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశాం. మినీ ట్యాంక్బండ్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని మంత్రి కేటీఆర్ చెప్పా రు. ట్యాంక్బండ్ ఏర్పాటుపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు కంటివెలుగులో పరీక్షలు చేయించుకోవాలి. పట్టణంలో ఆర్టీసీ స్థలాన్ని లాక్కొని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించారని విమర్శలు చేస్తున్నారు. అలాంటి ఆధా రం లేని మాటలను ప్రజలు పట్టించుకోవద్దు. మరికల్ బస్టాండ్ ఎదురుగా స్థలాన్ని కేటాయించిన విషయాన్ని గమనించాలి. జిల్లా కేంద్రంలో రూ. 10.65 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నాం. మండుటెండల్లో బహిరంగ సభకు వేల సంఖ్యలో ప్రజలు హాజరుకావడం పేట చరిత్రలో ఇప్పటివరకు లేదు. సభకు వచ్చిన వారందరికీ పేరుపేరున ధన్యవాదాలు.
– ఎస్.రాజేందర్రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే