కోస్గి, మే 17: వచ్చేనెల 4న కోస్గి మున్సిపాలిటీలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వెల్లడించారు. మంగళవారం కోస్గిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోస్గి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పట్టణంలోని శివాజీ చౌరస్తా నుంచి సయ్యద్ పహాడ్ దర్గా వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన, ధోబీ ఘాట్ ఏర్పాటుకు మంత్రి భూమిపూజ చేస్తారన్నారు. అనంతరం మార్కెట్ షెడ్లు, బస్డిపో, బస్టాండ్ను ప్రారంభిస్తారన్నారు. అంతకుముందు పట్టణంలోని పంచతంత్ర పార్కు ఏర్పాటు, ధోబీ ఘాట్ ఏర్పాటుపై ఎమ్మెల్యే కులసంఘ నాయకులతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు హన్మంత్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ భీంరెడ్డి, పట్టణాధ్యక్షుడు రాజేశ్, కౌన్సిలర్లు మాస్టర్ శ్రీనివాస్, బాలేశ, ఓంప్రకాశ్ తదితరులున్నారు.