మహబూబ్నగర్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు జిల్లా చరిత్రలో నిలిచే లా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ, ఎ నర్జిటిక్ కారిడార్ను ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి కేటీఆర్ శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ టవర్ వ ద్దకు చేరుకున్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, కూచుకుళ్ల దామోదర్రెడ్డికి ప ర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివి ధ వేషధారణాలు, సంప్రదాయ నృత్యాలతో ఘ న స్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ ఐటీ టవ ర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఐదు అంతస్తుల్లో ఉన్న ఐటీ టవర్లోని సదుపాయాలు, బ్రాంచ్లను పరిశీలించారు. కారిడార్ నిర్మాణం అద్భుతంగా ఉందని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎనిమిది కంపెనీలు తమ కార్యకలాపాలను ఇక్కడి నుంచే ప్రారంభించనున్నాయని చెప్పారు. ఆయా కంపెనీలతో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఇంకా ఔత్సాహిక కంపెనీలు ఉం టే స్టార్టప్ ఇన్నోవేటర్లు పెట్టుకోవచ్చని ఆహ్వానించారు. ఐటీ టవర్లో సెంట్రల్ ఏసీ, లిఫ్ట్, నిరంతర నాణ్యమైన విద్యుత్, తాగునీరు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు. ఆయా కంపెనీలకు రాకపోకలు సాగించేందుకు 44వ జాతీయ రహదారి నుంచి ఐటీ కారిడార్ వరకు 100 ఫీట్ల నా లుగులేన్ల రహదారిని నిర్మిస్తున్నారు. ఈ రహదారిని మహబూబ్నగర్ బైపాస్ వరకు అనుసంధానించాలని అధికారులను ఆదేశించారు. యువకులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలకు కూడా అవకాశం ఇస్తామని టీఎస్ఐఐసీ అధికారులు చెప్పారు.
అమరరాజా కంపెనీకి భూమిపూజ..
ఐటీ పార్కులో టీఎస్ఐఐసీకి అప్పగించిన 400 ఎకరాల్లో 270 ఎకరాలను అమరరాజా గిగా లిథియం సెల్ ఫ్యాక్టరీకి అప్పగించారు. అమరరాజా కంపెనీకి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. అనంతరం ఫ్యాక్టరీ నమూనాను పరిశీలించారు. అమరరాజా బ్యా టరీ కంపెనీ సౌకర్యాలపై రూపొందించిన షార్ట్ ఫిలీంను మంత్రులు తిలకించారు. ‘పాలమూరు అభివృద్ధి పరుగులు’ పేరిట ప్రత్యేకంగా చిత్రీకరించిన డాక్యుమెంటరీని చూశారు. కాలుష్యం లేకుండా బ్యాటరీ కంపెనీ దశల వారీగా పదేండ్లల్లో దాదాపు రూ.9,500 కోట్ల పెట్టుబడి పెడుతుందని కంపెనీ ఫౌండర్ రాంచంద్రనాయుడు వెల్లడించారు. తమ కంపెనీ చేపట్టిన కార్యక్రమాలను ఎంపీ గల్లజయదేవ్ వివరించారు. ఒక ఆ డబిడ్డగా కంపెనీ పెట్టేందుకు వచ్చానని, సొంత రాష్ర్టానికి వచ్చినట్లు ఉందని మాజీ మంత్రి గల్ల అరుణకుమారి చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నర్సింహగౌడ్, టీఎస్ఐఐసీ జోనల్ చైర్మన్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ సభ సక్సెస్..
ఐటీ టవర్ వద్ద కలెక్టర్, ఎస్పీ, బీఆర్ఎ స్ నేత రవికుమార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజివెంకన్న, ఐటీ సెల్ ఇన్చార్జి ఉమాకాంత్.. మంత్రి కేటీఆర్కు పూ లబొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. మ హబూబ్నగర్ జిల్లా కేంద్రం అంతా భా రీ కటౌట్లు, ఫ్లెక్సీలతో గులాబీమయం గా మారింది. బాలుర జూనియర్ కళాశాల మై దానంలో నిర్వహించిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. ఎండ ను సైతం లెక్కచేయకుండా కేటీఆర్ ప్రసంగం విన్నారు. ఈలలు, చ ప్పట్లతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. జై కేటీఆర్, జై శీన న్న నినాదాలు మిన్నంటాయి. సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు ఆ నందం వ్య క్తం చేశా రు.
తొమ్మిది కంపెనీలకు ఎంవోయూలు
ఐటీ కారిడార్లోకి కంపెనీల రాక మొదలైందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఐటీ టవర్ను ప్రారంభించిన అనంతరం అమరరాజా బ్యాటరీ కంపెనీతోపాటు మరో ఎనిమిది పరిశ్రమలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు రావడంతో వారికి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ ఎంవోయూలను పంపిణీ చేశారు. ముల్లార్ డాట్కనెక్ట్, అమరరాజా గ్రూప్, జువేన్ టెక్నాలజీస్, ఇంటూట్స్ ఎల్ఎల్సీ, ఉర్ఫాన్ టెక్నాలజీస్, ఈ-గ్రోవ్ సిస్టమ్స్, ఐటీ విజన్ 360 ఇంక్, ఫోన్ ఓక్స్ ఇంక్, బీసీడీసీ క్లౌడ్ సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఇక్కడ కొలువుదీరనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరువలో ఉండడంతో పరిశ్రమల యజమానులు ఐటీ టవర్లో కంపెనీల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారనారు. ఐటీ రంగాన్ని విస్తరించాలనే లక్ష్యంతో వరంగల్, కరీంనగర్, ఖమ్మంతో పాటు మహబూబ్నగర్లో టవర్లను ప్రారంభించగా.. నిజామాబాద్, నల్లగొండ, సిద్దిపేటల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.