పెంట్లవెల్లి, మే 27 : మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తీసుకొచ్చిన ధాన్యం లో తాలు లేకుండా పరిశీలించి కాంట వేసి రైస్ మిల్లర్లకు తరలించాలని సిబ్బందికి సూచించారు.
ధాన్యం కొనుగొలు విషయంలో ఏమైనా ఇబ్బందులున్నాయా అని అక్కడున్న రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలం లో డబ్బులు చెల్లించాలని సమాఖ్య సభ్యులకు సూ చించారు. కార్యక్రమంలో నాయకులు రామన్గౌ డ్, నరసింహ, ఎర్ర శీను, భాస్కర్గౌడ్, కబీర్, వెం కటస్వామి తదితరులున్నారు.