‘బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరగాలె.. నేతల మైండ్ బ్లాంకైపోయేలా రూపొంది స్తున్నాం.. రైతులు, ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నాం.. కేసీఆర్ అంటే మాట తప్పరు.. మడమ తిప్పని వారు.. బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదన్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష.. ఆయన సారథ్యంలో తెలంగాణ అభివృద్ధిలో బ్రహ్మాండంగా అడుగులు వేస్తున్నాం’.. అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం కల్వకుర్తిలో రూ.17.5 కోట్లతో వంద పడకల దవాఖాన నిర్మాణానికి భూమిపూజ, రూ.45 కోట్లతో మిషన్ భగీరథ, రూ.10 కోట్లతో నిర్మాణం పూర్తయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సెగ్రిగేషన్ షెడ్ను ఎంపీ రాములు, విప్ గువ్వల, ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీ విభజన చట్టంలోనిదే అని, పార్లమెంట్లో తొమ్మిదేండ్ల కిందటే చట్టం చేసినట్లు చెప్పారు. మోదీ మాట్లాడితే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాత్రమే ఉండాలని హితవు పలికారు. కాంగ్రెస్లో పోటీ చేసేందుకు మనుషులు లేరని, బీఆర్ఎస్ పక్కన పెట్టినోళ్లకు సీట్లు కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు.
– నాగర్కర్నూల్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ)
నాగర్కర్నూల్, నమస్తే తెలంగాణ (అక్టోబర్ 1) : త్వరలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో తయారు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. “ఎన్నిక ల్లో గెలిపిస్తే ఐదేండ్లల్లో పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేస్తానన్న మోదీ ఎందుకు పూర్తిచేయలేకపోయారు? విభజన చట్టంలో ఉన్న గిరిజన యూనివరిటీని తొమ్మిదేండ్లపాటు నాన్చి ఇప్పుడు కొత్తగా ఇ స్తున్నట్లు ప్రకటించడం సరికాదు.. అదే చట్టంలో ఉ న్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యా క్టరీ గురించి చెప్పాలి” అని మంత్రి డిమాండ్ చేశా రు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి, ఆమనగల్లులో దవాఖాన పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో మంత్రి ప్రసంగించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వ చ్చాక మహిళలు, వితంతులు, వృద్ధులు, యువత, రైతులకు ఏం చేయాలో మ్యానిఫెస్టోలో పేర్కొన్నామన్నారు. మహారాష్ట్రతో పాటు దేశ ప్రజలు తెలంగాణలోని పథకాలు కావాలని రోడ్లమీదకు వచ్చి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారన్నారు. దేశంలో రైతుల కోసం ఉన్న ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ అంటే మాట తప్పనివాడు, మడమ తిప్పని వాడు అని కొనియాడారు. కేసీఆర్ వల్ల తెలంగాణ వస్తదని ఎవ్వరూ అనుకోలేదని, వస్తే జైత్రయాత్ర, లేకుంటే శవయాత్రంటూ ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిం ది కేసీఆరేనన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కాకుండా కాంగ్రెస్సోళ్లు భూసేరకరణను అడ్డుకున్నా, ఎన్ని అడ్డంకులు సృష్టించి కేసులు వేసినా సీఎం కేసీఆర్ ప్రాజెక్టును పూర్తి చేసి ఇటీవల ప్రారంభించారన్నారు. ఆ నీళ్లు వస్తే కల్వకుర్తిలో లక్షా యా భైవేల ఎకరాలతో రెండు పంటలు పండుతాయన్నా రు. ఇదంతా జరగాలంటే కేసీఆర్ను మళ్లీ సీఎం చే యాలన్నారు. ప్రధాని మోదీ ఐదేండ్ల క్రితం వచ్చి మమ్నల్ని గెలిపిస్తే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని చెప్పి ఎందుకు పూర్తి చేయలేదని? జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నాలుగు చిలుక పలుకులు పలికారని, గిరిజన యూ నివర్సిటీని కొత్తగా ఇచ్చేదేంటని, తొమ్మిదేండ్ల కింద టే తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని విభజన చట్టంలో పెట్టారన్నారు. ఇప్పుడొచ్చి యూ నివర్సిటీ ఇస్తామంటూ చెవిలో పూలు పెడతారా? అని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్కు ఓటు వేస్తే మన కండ్లను మనమే పొడుచుకున్నట్లు అవుతుందన్నారు.
కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాటలు, ఎకరం భూమికి, రూ.పదికోట్లకు టిక్కెట్లను అమ్ముకుంటున్నారని, వారిని తప్పిపోయి గెలిపిస్తే తెలంగాణను కూడా అమ్ముకుంటారన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం కండ్లల్లో ఒత్తులేసుకోవాల్సి వస్తుందని, ఎరువుల కోసం చెప్పులు క్యూలో పెట్టే పరిస్థితులు మళ్లీ వస్తాయన్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని, ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతున్నదన్నారు. సీఎంగా కేసీఆర్ వచ్చాకే వైద్యరంగంలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్కు హ్యాట్రిక్ ఖాయమన్నారు. పాలమూరు ఎత్తిపోతలతో ప్రజల కాళ్లు కడిగి వారి రుణం తీర్చుకుంటామన్నారు. సమిష్టిగా పని చేసి బీఆర్ఎస్ను, జైపాల్యాదవ్ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చే సేందుకు మనుషులు లేరని, బీఆర్ఎస్ పక్కన పెట్టినోళ్లకు వాళ్లు టిక్కెట్లు ఇస్తున్నారని, ఇక్కడి చెల్లని నాణేలు అక్కడ చెల్లుతాయా అని ఎద్దేవా చేశారు. గతంలో నేనురాను బిడ్డో సర్కార్ దవాఖానకు అం టే.. నేడు నేను పోతాను సర్కారు దవాఖానకు అనే పరిస్థితులు వచ్చాయన్నారు. కరోనా పరిస్థితులు వ చ్చినా పేదలను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని కాపాడుకున్నడన్నారు. కాంగ్రెస్ హయాంలో అత్తాకోడళ్ల పంచాయతీలు ఉండేవని, ఆసరా పింఛన్ల పెంపు, పది కిలోల బియ్యంతో తగ్గిపోగా పేదలు, వృద్ధుల్లో ఆత్మగౌరవం నింపామన్నారు.
కశిరెడ్డిపై మంత్రి ఫైర్
ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డిపై మంత్రి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రెండుసార్లు టిక్కెట్లు ఇచ్చి ఎమ్మెల్సీని చేస్తే తల్లి గుండెల మీద తన్నినట్లుగా పార్టీని విడిచిపోతున్నాడని, అలాంటి వ్యక్తి రాబోయే కాలంలో కల్వకుర్తి ప్రజలను కూడా మోసం చేస్తారన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఉంటా.. లేకుంటే ఉండను అనడం ఎంతవరకు సమంజసమన్నారు. ఏం చేసిందని కాంగ్రెస్లోకి పోతున్నావని కశిరెడ్డిని నిలదీశారు. కల్వకుర్తి పేరున్న ప్రాజెక్టుతో నీళ్లు అందించలేని పార్టీలోకి వెళ్తారా అని ప్రశ్నించారు. పెడితే పెండ్లి, లేకుంటే చావు కోరుతావా అని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు కొబ్బరికాయ కొడితే, వైఎస్ పలకలు వేయడం, వైఎస్ కొబ్బరికాయ కొడితే చంద్రబాబు పలకలు వేస్తూ రాజకీయ డ్రామాలు నడిపారన్నారు. జైపాల్యాదవ్ బడుగుబలహీన వర్గాల నాయకుడని, సీఎం కేసీఆర్కు చాలా ఇష్టమైన నాయకుడన్నారు. అభివృద్ధే ధ్యేయంగా, శ్వాసగా పనిచేస్తున్న జైపాల్ను నాలుగోసారి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జైపాల్ యాదవ్ కోరిక మేరకు కల్వకుర్తిలో వంద పడకలు, ఆమనగల్లో యాభై పడకల దవాఖాన పనులకు శంకుస్థాపన చేశామన్నారు. పాము కాటై నా, తేలు కాటైనా, బొక్కల డాక్టరైనా కల్వకుర్తిలోనే అందుబాటులో ఉంటారన్నారు. బీఆర్ఎస్ కల్వకుర్తి రూపురేఖలే మార్చిందన్నారు. సీఎం కేసీఆర్ వల్లే పాలమూరు ఎత్తిపోతల పథకంతో లక్షా యాభైవేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ మళ్లీ గెలవాలన్నారు.
బీఆర్ఎస్కు హ్యాట్రిక్ పక్కా..
కల్వకుర్తి రూరల్, అక్టోబర్ 1 : ప్రతిపక్షాలు ఎ న్ని కుట్రలు పన్నినా ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని, రాష్ట్రంలో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ పక్కా అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలో రూ.70కోట్ల పనులకు మంత్రి ప్రారంభోత్సవం, భూమిపూజ చేశారు. పట్టణంలోని సర్వే నెంబర్ 99లో రూ.17.5కోట్లతో చే పట్టనున్న వంద పడకల దవాఖాన నిర్మాణానికి భూమిపూజ, రూ.45కోట్లతో చేపట్టనున్న మిష న్ భగీరథ యూనిట్, రూ.10కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సెగ్రిగేషన్ షెడ్డును ప్రారంభించారు. అనంతరం పట్టణంలో పీఏసీసీఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్దే..
ఉమ్మడి జిల్లాలో 14స్థానాలు బీఆర్ఎస్వేనని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నాయకులకు కల్వకుర్తి ప్రజలు తగిన బుద్ధిచెబుతారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి నీరందించడంలో మంత్రి హరీశ్రావు కృషి ప్రశంసనీయమన్నారు.
వైద్యారోగ్య శాఖ పనితీరు మెరుగుపడింది..
స్వరాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ పని తీరు మెరుగుపడిందని ఎంపీ రాములు అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందన్నారు. కల్వకుర్తి గుండా మూడు జాతీయ రహదారులు వెళ్తున్నాయని, కల్వకుర్తికి బంగారు భవిష్యత్ ఉందన్నారు. అభివృద్ధికి పాటుపడుతున్న బీఆర్ఎస్కు కల్వకుర్తి ప్రజలు అండగా ఉండాలని కోరారు.
మూడోసారి కేసీఆరే సీఎం..
వంద పడకల దవాఖాన నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి మూడోసారి సీఎంగా కేసీఆర్ను చేద్దామన్నారు. ఎమ్మెల్సీగా కశిరెడ్డి రెండు పర్యాయాలు పనిచేసి ఇప్పుడు వేరే పార్టీలో చేరడం తల్లి పాలుతాగి రొమ్ము గుద్దడమేనన్నారు. పార్టీలో 12 ఏండ్లుగా పనిచేస్తున్న తనను గుర్తించి సీఎం కేసీఆర్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారని పేర్కొన్నారు.
కల్వకుర్తి అభివృద్ధిలో ముందంజ..
ప్రాణం ఉన్నంత వరకు కల్వకుర్తి ప్రజలకు సేవ చేస్తానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కల్వకుర్తి ప్రజలు చాలా చైతన్యవంతులని గుర్తు చేశారు. కల్వకుర్తి అభివృద్ధిలో చా లా ముందుందని, పట్టణం మీదుగా మూడు జాతీయ రహదారులు, ఆమనగల్ సమీపంలో రీజనల్ రింగ్ రోడ్డు వెళ్తున్నదన్నారు. ఎంజీకెఎల్ఐకి కల్వకుర్తి ఎత్తిపోతలగా నామకరణం చేసి రూ.565కోట్లతో ప్రాజెక్టు పనులు పూర్తి చేసి యాభైవేల ఎకరాలకు సాగునీరందిస్తున్నారని గుర్తు చేశారు. పీఆర్ఎల్ఐతో మరో 18నెలల్లో ఈ ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగునీరందనుందన్నారు. నియోజకవర్గంలో రూ. ఐదువేల కోట్లతో అభివృద్ధి జరగుతున్నదన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ఆయన ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపా రు. పార్టీకి ద్రోహం చేసినోళ్లను నమ్మొద్దని, వారికి డిపాజిట్లు కూడా రావన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్లేశం, కల్వకుర్తి ము న్సిపల్ చైర్మన్ సత్యం, వైస్ చైర్మన్ షాహేద్, కల్వకుర్తి, ఆమనగల్లు ఏఎంసీ చైర్మన్లు విజయ్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీలు వెంకటేశ్, విజితారెడ్డి, దశరథ్నాయక్, అనురాధ, ఎంపీపీ మనోహర, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.