మూసాపేట(అడ్డాకుల), మే 14 : అడ్డాకుల మండలంలోని బలీదుపల్లికి చెందిన విద్యార్థి సూర్యసిద్ధాంత్ శౌర్య ఇటీవల నిర్వహించిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ప్రతిభకనబర్చి 17వ ర్యాంకు సాధించాడు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో విద్యార్థి సూర్యసిద్ధాంత్ శౌర్యను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సన్మానించి అభినందించారు.
క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అదేవిధంగా బలీదుపల్లికి చెందిన లోకమోని గోవిందు కుమారుడి వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.37,500 చెక్కును మంత్రి నిరంజన్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ యువనాయకుడు శ్రీధర్ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.