ఆత్మకూరు, అక్టోబర్ 25: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్బ్లాంక్ అయ్యిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణం సమీపంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమవేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలనే విధానంతోనే తొమ్మిదిన్నరేండ్లుగా పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్వన్గా నిలిచిందన్నారు. మన నిధులు మనకే అనే నినాదాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తూ రాష్ట్రంలోని ప్రతిపల్లె, బస్తీని సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కారేనని.. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ సారేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని కుటుంబం అంటూ లేదని, వారి ఆశీర్వాదాలే మరోసారి బీఆర్ఎస్ పార్టీకి గెలుపునందిస్తాయన్నారు.
గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, బూత్ కమిటీ ప్రతినిధులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు గడపగడపనూ తట్టి ప్రభుత్వ, సంక్షేమ పథకాలను వివరించి కారు గుర్తుకు ఓటేసేందుకు కృషిచేయాలన్నారు. కార్యకర్తలు సైనికుల్లా శ్రమించి పార్టీ విజయానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. రెండుమూడు రోజుల్లో మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వచ్చేనెల 6న సీఎం కేసీఆర్ మక్తల్కు రానున్నారని చెప్పారు. ఉదయం 10గంటలకు నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు ప్రతి గ్రామం నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఆంజనేయగౌడ్, ఎంపీపీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, పీఏసీసీఎస్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాయిత్రీయాదవ్, వైస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీధర్గౌడ్, సర్పంచులు, ప్రాదేశిక సభ్యులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బూత్కమిటీ ప్రతినిధులు, అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు.