నవాబ్పేట, ఫిబ్రవరి 10 : రేషన్ దుకాణంలో ప్లాస్టిక్ బియ్యాన్ని పోలిన రైస్ మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రే పాయి. నవాబ్పేట మండలం లోకిరేవు గ్రా మానికి రెండ్రోజుల కిందట పౌరసరఫరాల శాఖ నుంచి రేషన్ బియ్యం వచ్చాయి. డీలర్ గీతమ్మ శు క్రవారం నుంచి లబ్ధిదారులకు పంపిణీ ప్రారంభించిం ది. అయితే బియ్యం తీసుకెళ్లిన తెల్లరేషన్ కార్డుదారులు వాటిని వండుకొని తింటుంటే అందులో కొన్ని మెతుకులు రబ్బర్లా మెత్తగా సాగడాన్ని గమనించారు. దీంతో పలువురికి అనుమానం వచ్చి బియ్యాన్ని పరిశీలించారు. తెచ్చిన బియ్యంలో అక్కడక్కడ ప్లాస్టిక్ బియ్యాన్ని పోలిన రైస్ కనిపించింది. వాటిని వేరుచేసి సో షల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పెట్టడంతో వైరల్గా మారింది. ఈ వి షయం తెలుసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డీ టీ నాగరాజు, రెవెన్యూ అధికారులు గ్రా మంలోని రేషన్ దుకాణానికి చేరుకొని బియ్యాన్ని పరిశీలించారు. ప్రజలకు విటమిన్స్ అందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వమే క్వింటాకు కేజీ చొప్పున బియ్యంలో వివిధ బలవర్థకమైన (ప్రొటీన్స్) పదార్థాలను తయారు చేయించి కలుపుతున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ నాగరాజు తెలిపారు. బియ్యాన్ని పిండి చేసి బీ-12, ఫ్లోరిక్ యాసిడ్తోపాటు సూక్ష్మ పోషక పదార్థాలు యాడ్ చేసి బియ్యాన్ని తయారు చేస్తారన్నారు. లబ్ధిదారులు ఆం దోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ వి షయమై గతంలోనే డీలర్లకు అవగాహన కల్పించామని తెలిపారు. అయితే అదే గ్రా మానికి చెందిన పలువురు బియ్యంపై అ నుమానం వ్యక్తం చేశారు. బియ్యం కడిగే సమయంలో వాటర్లో తేలుతున్నాయని, వండిన తర్వాత రబ్బర్లా మారుతున్నాయని.. తినాలంటే ఒక రకమైన భయం ఉంటుందన్నారు.