పాలమూరు, మార్చి 17 : మహబూబ్నగర్ మెట్టుగడ్డ వద్ద ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శాంత య్య ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. దివిటిపల్లిలోని అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్లో 200 ఖాళీల భర్తీకి జాబ్మేళాను నిర్వహిస్తున్న ట్లు తెలిపారు.
ఐటీఐలో వివిధ రకాల ట్రేడ్స్ ఉత్తీర్ణత సా ధించిన అభ్యర్థులు బయోడేటా, ఆధార్కార్డు, రెండు ఫొటోలు, ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖా తా జిరాక్స్ సెట్లతో రావాలని సూచించారు. ఈ అవకా శాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలని కోరారు.