మహబూబ్నగర్టౌన్, జనవరి 7 : ఖమ్మంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అథ్లెట్లు 8 బంగారు, 8 వెండి, 2 కాంస్య పతకాలు సాధించారు. టోర్నీలో పతకాలు సాధించడంపై జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్గౌడ్, పరశురాం అభినందించారు.
జిల్లాలో ప్రతిభగల క్రీడాకారులకు కొదవలేదని, ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించారని గుర్తు చేశారు. పతకాలు సాధించిన క్రీడాకారులు ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు పుణెలో జరగనున్న జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీలో పాల్గొననున్నారని తెలిపారు.