నారాయణపేట, ఆగస్టు 27 : ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రతి వ్యక్తికి సమాన న్యాయం అందించడమే న్యా య సేవా సదనం ముఖ్య ఉద్దేశమని రా ష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ చైర్మ న్, హైకోర్టు జడ్జి నవీన్రావు అన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శ నివారం పట్టణంలోని నైపుణ్య శిక్షణా కేంద్రంలో అసంఘటిత కార్మికులకు హ క్కులు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మెగా లీగల్ అవేర్నెస్ క్యాంపునకు ముఖ్య అథితిగా ఆయ న హాజరయ్యారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మనకు కావాల్సిన వాటిని ఇతరులు లాక్కుంటే వాటిని సాధించుకోవడానికి న్యాయ పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. అయితే ఆర్థిక స్థోమత లేని వారి కోసం న్యాయం, స్వేచ్ఛ అం దించేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీని రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యా ప్తంగా 14 వందల లీగల్ అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లలు, దివ్యాంగులు, ప్రకృతి వైపరీ త్యం వల్ల సర్వం కోల్పోయిన వ్యక్తుల కోసం న్యాయ సేవా సదనంతో ఉచితం గా న్యాయసేవ అందించనున్నట్లు పేర్కొన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారం కో సం లోక్ అదాలత్లు ఏర్పాటు చేశామ ని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రూ. 280 కోట్ల నష్ట పరిహారం అందించామన్నారు. అనంతరం మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల అడ్మిస్ట్రేషన్ జడ్జి లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్ర భుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకా లు దేశంలోని 140 కోట్ల మందికి చేరుతున్నాయా..? లేదా అని చూడాల్సిన బాధ్యత లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఉం దన్నారు. కన్జ్యూమర్ యాక్ట్, భూ సేకరణ చట్టం, కార్మిక కనీస వేతన, ఇతర చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన, జిల్లా సె షన్స్ కోర్టు జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ, ఎస్పీ వెంకటేశ్వర్లు, లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా సెక్రటరీ సంధ్యారాణి, మహబూబ్నగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, స్టేట్ లీగల్ సర్వీసెస్ మెంబర్ సెక్రటరీ గోవర్ధన్రెడ్డి, ఆంజనేయులు, అదనపు కలెక్టర్ పద్మజారాణి, బార్ అ సోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కోర్టు భవనానికి స్థలం బాగుంది..
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 27 : మహబూబ్నగర్ జిల్లా నూతన కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నవీన్రావు, లక్ష్మణ్ పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి వద్ద స్థలాన్ని జిల్లా న్యాయమూర్తి ప్రేమావతితో కలిసి వారు సందర్శించారు. ఈ సందర్భంగా న్యా యమూర్తులు మాట్లాడుతూ బైపాస్ స మీపంలో నుంచే వెళ్లే ఈ స్థలం బాగుందని వారన్నారు. వారి వెంట న్యాయమూర్తులు శ్రీనివాసులు, నీరజ, పద్మ, కిరణ్ కుమార్తోపాటు న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమిరెడ్డి లక్ష్మారెడ్డి, సీనియర్ న్యాయవాదులు మనోహర్ రెడ్డి, ప్రతాప్కుమార్ ఉన్నారు.
జిల్లా కోర్టుకు స్థల పరిశీలన..
ఊట్కూర్, ఆగస్టు 27 : మండలంలోని తిప్రాస్పల్లి గ్రామ శివారులో జిల్లా కోర్టు భవన నిర్మాణానికి హైకోర్టు జడ్జి పి. నవీన్రావు, జిల్లా కోర్టు జడ్జి కే.లక్ష్మణ్, కలెక్టర్ హరిచందన స్థల పరిశీలన చేశారు. సర్వే నెంబర్-61లో 13 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించినట్లు కలెక్టర్ వివరించారు. వారి వెంట ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రాంచందర్, తాసిల్దార్లు తిరుపతయ్య, దానయ్య, సర్పంచ్ సుమంగళ, సర్వేయర్ మల్లేశ్ ఉన్నారు.