నాగర్కర్నూల్, ఏప్రిల్ 3 : కందనూలు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా ఈ సారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం తొలిసారని చెప్పుకోవచ్చు. దీంతో ఉద యం నుంచే ఉక్కపోత ప్రారంభం కావడంతో ప్రజ లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత మూడు రోజులు గా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తుండడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. జిల్లాలో ఏ ఒక్క మండలంలోనూ 38 డిగ్రీలకు ఎండ తక్కువ లేదని మంగళవారం ఉదయం నుంచి బుధవారం డిగ్రీలు ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే తెలుస్తోంది. గత 24గంటల ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 17 గ్రామాల్లోని 40.1 డిగ్రీల నుంచి 42.9 డిగ్రీలకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జి ల్లాలో అత్యధికంగా వంగూరు మండలం కిష్టంపల్లిలో 42.9 డిగ్రీలు నమోదుకాగా, అత్యల్పంగా అమ్రాబాద్ మండలం వటువర్లపల్లిలో 37.9 డి గ్రీలు నమోదైంది.
అదేవిధంగా వెల్దండ మండలం బొల్లంపల్లి, పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లిలో 40.1 డిగ్రీలు, ఉప్పునుంతల మండల కేంద్రంలో 40.2 డిగ్రీలు, తాడూరు మండలం ఎం గంపల్లిలో 40.5 డిగ్రీలు, వెల్దండ మండల కేంద్రంలో 40.8 డిగ్రీలు, నాగర్కర్నూల్ మండ లం తూడుకుర్తి, పెంట్లవెల్లి మండలం జటప్రోలులో 40.9 డిగ్రీలు, కల్వకుర్తి మండలం ఎల్లికల్లో 41.0, ఉప్పునుంతల మండలం వెల్టూర్లో 41.3 డిగ్రీలు, అచ్చంపేట మండలం ఐనోలులో 41.4, బిజినేపల్లి మండల కేంద్రంలో 41.6, కోడేరు పట్ట ణం, చారకొండ మండలం సిరసనగండ్లలో 41.8, కల్వకుర్తిలో 42.1, కొల్లాపూర్లో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం 22.0 నుంచి 30 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.