బిడ్డకు జన్మనివ్వాలంటే మాతృమూర్తికి అది పునర్జన్మే.. అంతటి కష్టమైన ప్రసవం కోసం ప్రైవేటు దవాఖానలకు వెళ్లి రూ.వేలకు వేలు ఖర్చు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.. పేదలకు ఈ పరిస్థితి రావొద్దనే ఉద్దేశంతో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రూ.17 కోట్లతో వనపర్తిలో ఎంసీహెచ్ను మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి ప్రారంభించారు. నాటి నుంచి ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల్లోనే 3,512 కాన్పులు జరిగాయి. కేసీఆర్ కిట్తో మరింత ప్రయోజనం చేకూరుతున్నది. ఇక్కడి వైద్య సేవలు చాలాబాగుండడంతో గర్భిణులు ఆసక్తి చూపుతున్నారు. నిత్యం దవాఖానకు క్యూ కడుతున్నారు.
వనపర్తి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ప్రభు త్వ దవాఖానల్లో ప్రజలకు నిరంతరం వైద్యసేవలందుతున్నాయి. దీంతో ప్రజలు క్యూ కడుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సౌకర్యాలు ఏ ర్పాటు చేయడంతో కార్పొరేట్కు దీటుగా వైద్యం అం దుతున్నది. ఈ క్రమంలో ప్రసవాల కోసం ఇటీవల వనపర్తి జిల్లాలో మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి ప్రారంభించిన మాతాశిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) సత్ఫలితాలిస్తున్నది. రూ.17 కోట్లతో ని ర్మించిన భవనంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించా రు. పేద, ధనిక తేడా లేకుండా ప్రసవం కోసం అంద రూ ఇక్కడికే వస్తున్నారు. గర్భిణి అని తెలిసినప్పటి నుంచి కాన్పు చేసేవరకు పూర్తిస్థాయి వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి.
గైనకాలజిస్టులు, ల్యాబ్ సేవ లు, నర్సింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండడంతో ఇక్కడే ప్ర సవాలు చేయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మార్చి 2022 వరకు జనరల్ దవాఖానల్లోనే ప్రసూతి సేవలు అందించేవారు. ఏప్రిల్ నుంచి ఎంసీహెచ్ అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 2022 నుంచి అక్టోబర్ వరకు ఎంసీహెచ్లో 3,512 కాన్పులు చేశారు. ఇందులో 1579 నార్మల్, 1,933 సిజేరియన్ ప్రసవాలు చేశారు. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అత్యవసరమైతే తప్పా సిజేరియన్లు చేయడం లేదు. ప్రైవేట్ దవాఖానల కన్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువ కాన్పులు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ కిట్ అని కూడా చెప్పొచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత పోషకాహారం, తల్లీబిడ్డకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తుండడంతో బాలింతలు సంబురపడుతున్నారు. ఈ పథకం కింద రూ.12 వేల ఆర్థిక సాయంతోపాటు ఆడబిడ్డ పుడితే మరో రూ.వెయ్యి అదనంగా చెల్లిస్తున్నారు. కేసీఆర్ కిట్ ద్వారా బాలింతలు, పిల్లలకు అవసరమైన 16 రకాల వస్తువులు ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగింది.
పైసా ఖర్చులేదు..
ఎంసీహెచ్ దవాఖానల్లో సౌలత్ బాగుంది. పైసా ఖర్చు కా లేదు. ప్రైవేట్కు పోయేంత పైసలు మాకాడ లేవు. అందుకే ఇ క్కడికి వచ్చినం. నా కోడలుకు మొదటి నుంచి ఇక్కడే చూపెట్టినం. అన్ని టెస్టులు చేసిండ్రు. గోలీలు కూడా ఉచితంగానే ఇచ్చిన్రు. డాక్టరమ్మలు, నర్సమ్మలు చాలా మంచిగా చూస్తున్నారు. ఇంత మంచిగా వైద్యం అందించే దవాఖానను ఎప్పుడూ చూడలే. నాకు మనుమడు పుట్టిండు.
– నాయమ్మ, తండావాసి