మహబూబ్నగర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘నా ఇంట్లో తోబుట్టువు పెండ్లి ఎలా జరుగుతుందో.. అలా కార్యక్రమానికి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చి వైభవంగా పెండ్లి చేస్తాను’ అని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన ని ర్వహించనున్న సాముహిక వివాహాల్లో భాగంగా కా బోయే జంటలకు బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కేం ద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే మర్రి, ఆయన సతీమణి జమున కలిసి పెండ్లి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది ఎన్నికలు, ఓట్ల కోసమో నిర్వహించే తంతు కాదన్నారు. తూతూమంత్రంగా టెంటు వేసి తాళిబొట్లు ఇచ్చి మమ అనిపించకుండా.. జీవితంలో మరిచిపోలేని విధంగా తమ ట్రస్ట్ ద్వారా పెండ్లి జరిపిస్తామన్నారు.
ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో అనంతపూర్ ఎమ్మెల్యే పరిటాల రవి తనకు మిత్రుడైనందున సామూహిక వివాహాలకు ఆహ్వానించాడన్నారు. అక్కడ జరిగిన పెండ్లిళ్లు చూసి అలా చే యాలని అనుకునేవాడినని, ఇప్పుడు ఆ అవకాశం ద క్కిందన్నారు. బతికున్నంత వరకు ఈ కార్యక్రమం ని ర్వహిస్తానని ప్రకటించారు. అన్ని కులాలు, గోత్రాల వా రికి నచ్చేలా బ్రహ్మమూహుర్తాన్ని ఖరారు చేసి.. ఎంత మంది వచ్చినా ఉచితంగా వివాహాలు జరిపించేందుకు ఎంజేఆర్ ట్రస్ట్ ముందుంటుందన్నారు. పెండ్లి పనులను తన సతీమణి జమున దగ్గరుండి పర్యవేక్షిస్తున్నదని, తానే దగ్గరుండి వధువు, వరుడికి కావాల్సిన దుస్తులను సెలక్ట్ చేసిందన్నారు. వధూవరుల తల్లిదండ్రులకు కూ డా ఉచితంగా దుస్తులను అందజేస్తామన్నారు. అలాగే బీరువా, మంచం, వంట సామగ్రి కూడా ఇస్తామన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ అందరి సాంప్రదాయం ప్రకారం పెండ్లిళ్లు జరిపిస్తామన్నారు.
ఈ నెల 12వ తే దీన సుమారు 220 జంటలకు సామూహిక వివాహాలు ఉంటాయని అందరూ రావాలని కోరారు. అనంతరం మర్రి జమున మాట్లాడుతూ ప్రతి జంటకూ ఒక్కో ము త్యాల పందిరిలో పెండ్లి నిర్వహిస్తామన్నారు. ఫ్యాషన్ క ల్చర్కు అనుగుణంగా పెండ్లికి రెండ్రోజుల ముందు మె హిందీ ఫంక్షన్, పంజాబీ డోల్తో సంగీత్ ఉంటుందన్నా రు. ఇందుకుగానూ ప్రత్యేక డ్రస్కోడ్ అందజేస్తున్నట్లు వివరించారు. అన్నదానం కూడా ఉంటుందన్నారు. కా ర్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కారఘునందన్రెడ్డి, ప్ర జాప్రతినిధులు, వధూవరులు, బంధువులు ఉన్నారు.