బిజినేపల్లి, జనవరి 23 : రాష్ట్రంలోని రైతుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేతో కలిసి మండలంలోని శాయిన్పల్లి వద్ద ఉన్న మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ పైలాన్ వద్దకు చేరుకున్నారు. నాగం మార్కండేయ రిజర్వాయర్ చూ డడానికి రావడంతో మైలపట్టిందని, ఆ ప్రదేశాన్ని కృష్ణా జలాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరో ఆరు నెలల్లో మార్కండేయ రిజర్వాయర్ను పూర్తి చేసి రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తామన్నా రు. లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. మొ దట ఈ లిఫ్ట్ ఇరిగేషన్ 150 ఎకరాలు ముంపునకు గురవుతుండగా సర్వేలు నిర్వహించి పైపులతో లిఫ్ట్నకు నీరు అందేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు. దీంతో కేవలం ఏడు ఎకరాలకే నష్టం జరుగుతుందన్నారు. రాత్రిపూట వచ్చే కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మొద్దని విమర్శించా రు. పగటిపూట వస్తే పొలాలకు వచ్చే ఎంజీకేఎల్ఐ నీరు కనిపించేదని పేర్కొన్నారు. బిజినేపల్లిలో ఉన్న అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాలకు నివాళు లు అర్పించకుండా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వెళ్లడం సరికాదన్నారు. ఇదేలా దళిత గిరిజన ఆత్మగౌరవ సభ అని ప్రశ్నించారు.
నాగం రూ.5 కోట్ల ఖర్చు చేసి ఇలాం టి సభలు పెట్టే బదులు పేదల అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. నాగర్కర్నూల్ కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి ప్రజలను సభకు తీసుకొచ్చారని విమర్శించారు. బహిరంగసభలో ప్రజలకు ఎలాం టి అభివృద్ధి చేస్తారన్నది చెప్పలేదని దుయ్యబట్టారు. నాగం వేసిన సవాళ్లు స్వీకరించి ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టును పూర్తి చేయకపోతే జీవితాంగం నీ వెంట ఉండి ప్రచారం చేస్తానన్నారు. రేవంత్ భాష వినలేక సభ జరుగుతుండగానే ప్రజలు వెళ్లిపోయారని, ఎక్కువ మొత్తంలో హైదరాబా ద్ నుంచి ఆయన వెంబడి జనాలు ఉన్నారన్నారు. కాం గ్రెస్లో ఎందరో సీనియర్లు ఉన్నా ఈయన పీసీసీ అధ్య క్ష పదవిని తెచ్చికోవడం జరిగిందని ధ్వజమెత్తారు.
ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో పెండ్లిండ్లు..
ఫిబ్రవరిలో ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా వివాహాలు చేయనున్నట్లు ఎమ్మెల్యే మర్రి తె లిపారు. గ్రామాల్లో పాఠశాలలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. 25 మంది డాక్టరేట్ చదువుతున్న విద్యార్థులకు తమ ట్రస్టు నుంచి ఫీజులు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. తమ కుటుంబం కష్టించి ఉన్నతస్థాయికి వచ్చిందని, కానీ నా గం బియ్యం బిరుదును వైఎస్ఆర్ అసెంబ్లీలో ఇచ్చారని గుర్తు చేశారు. రైతులు నాగంపై ప్రశ్నించే ప్రయత్నంలో జరిగిన తోపులాటకు రాద్దాంతం చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, సింగిల్విండో చైర్మన్ బాల్రాజుగౌడ్, వైస్ ఎం పీపీ చిన్నారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.