బిజినేపల్లి, మార్చి 2: మండలంలోని గంగారం శివారు లో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్ పూర్తయితే పది గ్రామాలు, 25 తండాలకు సాగునీరు అందనుంది. దీంతో దాదాపు 8 వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. దాదాపు రూ. 80 కోట్లతో మండలంలోని వసురాం తండా సమీపంలో నిర్మించనున్న ఈ రిజర్వాయర్ పనులను ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించి ప్రారం భించారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమం త్రి కేసీఆర్ ఎంజీ కేఎల్ఐ నీరందని గ్రామాల రైతుల భూము లు సస్యశ్యామలం చేసేందు కోసం మార్కండేయ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు.
గతంలో కేఎల్ఐ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 29 నుంచి శాయిన్పలి, వసంతాపూర్ వరకు పాదయాత్ర చేట్టిన ఎమ్మెల్యే మర్రి జనార్ధ్దన్రెడ్డి మార్కండేయ రిజర్వాయర్ నిర్మించనున్న ప్రదేశంలో భూమి పూజ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఒక టీఎంసీ సామర్థ్యంతో చేపట్టనున్న ఈ రిజర్వాయర్ పూర్తయితే బిజినేపల్లి మండలంలోని ఏడు గ్రామాలు, 17 గిరిజన తండాలతో పాటు వనపర్తి జిల్లాలోని మూడు గ్రామాలు, ఎనిమిది తండాలకు సాగునీరు అందనుంది.
సాగునీరు అందనున్న గ్రామాలు
బిజినేపల్లి మండలంలోని శాయిన్పల్లి, మమ్మాయిపల్లి, పోలేపల్లి, లట్టుపల్లి, గంగారం గ్రామాలతోపాటు కిమ్యా తండా, పెద్ద తండా, కేసరిబండ తండా, వసురాంతండా, పెద్దఏముల తండా, ఎర్రకుంటతండా, అలుగుతండా, రావులచెరువుతండా, బద్యాతండా, బొడుసుగడ్డతండా, ఇప్పలతండా, చిన్నపీరు తండా, హీర్యాతండా, ఫూల్సింగ్ తండా, నెలగడ్డతండా, భీమునితండా, శాయిన్పల్లి తండా, వనపర్తి జిల్లా ఘణతపూర్ మండలంలోనని సోలీపూర్, రుక్కన్నపల్లి, జంగమాయిపల్లి, షాపూర్, ఆముదంబండ తండా, కర్నెతండా, దొంతికుంటతండా, కుంటముందరి తండా, గరయ్యబండతండా, పోతులకుంటతండా, రాంరెడ్డిపల్లి తండా, ఎర్రగడ్డ తండాల్లో దాదాపు 8 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. రిజర్వాయర్ పనులు ప్రారంభం కావడంతో ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వలసలు తగ్గుతాయి
మార్కండేయ రిజర్వాయర్ పూర్తయితే తండాల నుంచి వలస లు తగ్గనున్నాయి. ఇక్కడి పొలాల కు నీరు అందక గిరిజనులు గతం లో వలసలు వెళ్లేవారు. సాగునీరు వస్తే తండాల్లోని గిరిజనులు ఇక్కడే ఉండి పం టలు సాగు చేసుకుంటారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది.
– చందులాల్, సర్పంచ్, ఊడ్గులకుంట తండా
పూర్తిస్థాయిలో సాగునీరు
రిజర్వాయర్ పనులు పూర్తయితే ఇక్కడి పొలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందనుంది. దీంతో ఏటా రెండు పంటలు పం డించుకుంటాం. కేఎల్ఐ నీరంద ని గిరిజన తండాలు, గ్రామాలన్నీ ఈ రిజర్వాయర్ నీటితో పచ్చ బడతాయి.
– గోవిందు, చిన్నపీర్ తండా