జడ్చర్లటౌన్, డిసెంబర్ 29 : జడ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలో నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జడ్చర్ల కోర్టులో హాజరుపర్చినట్లు గురువారం జడ్చర్ల అబ్కారీ పోలీసులు తెలిపారు. అబ్కారీ పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన సయ్యద్ సమీర్, జావీద్ అనే ఇద్దరు యువకులు జ డ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయిని విక్రయిస్తుండగా అబ్కారీ పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. వారిద్దరి నుంచి రూ. 12వేలు విలువ గల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లోని ధూల్పేట్ నుంచి గంజాయిని ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జడ్చర్ల కోర్టులో హాజరుపరిచినట్లు అ బ్కారీ పోలీసులు తెలిపారు.