బిజినేపల్లి, జనవరి 16: మండల పరిధిలోని వట్టెం గ్రామంలో మాజీ ప్రియుడితో కలిసి ప్రియుడిని హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వట్టె్ంర గామానికి చెందిన కృష్ణమ్మ వనపర్తి మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన రవితో సహజీవనం చేస్తోంది. కాగా కృష్ణమ్మ అంతకు ముందే అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్తో చనువుగా ఉండేదన్నారు.
రవి పరిచయం అయ్యాకా దూరమైన శ్రీనివాస్ ఇటీవల కృష్ణ మ్మతో మాట్లాడుతుండడంతో అనుమానంతో రవి తరుచూ తాగి వచ్చి హింసించేవాడన్నారు. దీంతో విసిగిపోయిన కృష్ణ మ్మ శ్రీనివాస్తో కలిసి సో మవారం తెల్లవారుఝా మున రవి(35)ను బండరా యితో మోది హతమార్చిం దని తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్తలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించగా నిందితులిద్దరూ లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వీఆర్ఏ మన్నెంకొండ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హన్మంతు, ఎస్ఐ ఓబుల్రెడ్డి తెలిపారు.