ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
పట్టువస్ర్తాలు సమర్పించిన విప్ గువ్వల
హాజరైన జెడ్పీచైర్పర్సన్ పద్మావతి
భారీగా తరలొచ్చిన భక్తులు
ఉప్పునుంతల, మార్చి 17 : మండలంలోని మామిళ్లపల్లి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం గురువారం మ ధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరిగింది. పురోహితు లు వరదరాజు అయ్యంగార్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య వేడుక జరిపించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. నాగర్కర్నూల్ జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. లక్ష్మాపూర్, దాసర్లపల్లి, పెద్దాపూర్, మొల్గర, సదగోడు, తెల్కపల్లి, ఉప్పరిపల్లి తదితర గ్రామాల నుంచి భక్తులు, మహిళలు అ ధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఉమామహేశ్వర దేవస్థాన కమిటీ చైర్మన్ సుధాకర్, పాలక మం డలి సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో జెడ్పీటీసీలు ప్రతాప్రెడ్డి, రాంబాబు, సర్పంచు లు కల్పన, శిరీష, పర్వతాలు, బాలునాయక్, ఇంద్రాసేనారెడ్డి, ఎంపీటీసీలు కవిత, రామలక్ష్మమ్మ, ఈవో శ్రీనివాసరావు, దేవస్థాన కమిటీ చైర్మన్ రామస్వామిగౌ డ్, నాయకులు గోపాల్రెడ్డి, శ్రీను, బాల్రావు, అర్జున్రావు, రవీందర్రావు, దామోదర్, మోహన్గౌడ్, బాలరాజు, సుధాకర్, ఎల్లయ్య యాదవ్, బాలస్వామి ఉన్నారు.