ఊట్కూర్, మే 9 : అంధత్వ నివారణ కోసం తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తోంది. కంటి చూపు సమస్యతో బాధపడేవారికి ఉచితంగా మందులు, అద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేసేందుకు రెండో విడుత ‘కంటి వెలుగు’ కా ర్యక్రమాన్ని ప్రారంభించింది. మంగళవారం మండలంలోని పులిమామిడి సెక్టార్ పరిధిలో ఉన్న నిడుగుర్తి, ఊట్కూర్ సె క్టార్ పరిధిలోని పగిడిమర్రి గ్రామంలో కంటి వైద్య శిబిరాల ను నిర్వహించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు భవా నీ, శ్రీలత, సిబ్బంది జనార్దన్, ఆమేర్, ఏఎన్ఎంలు మంజు ల, సుజాత, లక్ష్మి, మహేశ్వరి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కృష్ణ మండలంలో..
మండలంలోని గుడెబల్లూర్లో కొనసాగుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ రాణి తేజశ్విని తెలిపారు. కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతిఒక్కరూ కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ రాణి తేజశ్విని ఆధ్వర్యంలో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది మల్లేశ్, డీఈవో నరేశ్, ఏఎన్ఎంలు ఫర్విన్భాను, సుధ, ఆశ కార్యకర్తలు లక్ష్మి, పద్మా శివమ్మ, రత్నమ్మ పాల్గొన్నారు.
ధన్వాడలో..
పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గోటూర్ సర్పంచ్ నారాయణరెడ్డి కోరారు. మంగళవారం గోటూర్లో గ్రామ పంచాయతీ వద్ద కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ మల్లికార్జున్, ఉపసర్పంచ్ వెంకట్రెడ్డి, వైద్య సిబ్బంది శ్రీనివాసులు, సూపర్వైజర్ వెంకటేశ్, ఏఎన్ఎం శివారాణి, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.