నవాబ్పేట, జనవరి 5 : మండలంలోని ఫతేపూర్ మైసమ్మ దేవత బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పాలకవర్గ సభ్యులు, కాకర్లపహాడ్ గ్రామస్తులు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించారు. గణపతిపూజ, కలశస్థాపన, ధ్వజారోహణ కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగానే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో చైర్మన్ పాశం కృష్ణయ్య, ఈవో మదనేశ్వర్రెడ్డి, సర్పంచ్ జంగమ్మ, ఉపసర్పంచ్ పెంటయ్య, మాజీ చైర్మన్ పాశం గోపాల్, నాయకులు సంజీవరెడ్డి, వెంకట్రెడ్డి, మాసయ్య, ఆంజనేయులు, పెంటయ్య, నారాయణరెడ్డి, నర్సిములు, బాలకిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.