శ్రీశైలం, మార్చి 1 : శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్బోర్డ్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమ, పూలు, పండ్లతో ఆలయ ప్రవేశం చేసి యాగశాలలో పూజాకార్యక్రమాలు నిర్వహించారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ శివసంకల్పాన్ని పఠించిన వేదపండితులు భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి పూజలు చేశారు. గణపతిపూజ, పుణ్యాహవాచ నం, చండీశ్వరపూజ, కంకణపూజ, కంకణధారణ, అ ఖండ దీపస్థాపన, వాస్తుపూజ, వాస్తుహో మం ప్రధాన కలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.
అంకురార్పణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని మట్టిని తీసుకుని 9 పాలికలలో వేసి క్రతువును చేశారు. ధ్వజారోహణలో భాగంగా నూతన వస్త్రంపై నంది పటాన్ని సిద్ధంచేసి ఊరేగించి చండీశ్వరస్వామి సమక్షం లో ప్రత్యేక పూజలు చేశారు. భేరిపూజ తరువాత మేళతాళాలతో సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికారు. అనంతరం భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీనివాసులు పట్టువస్ర్తాలను సమర్పించారు.